ప్రశ్నించే గొంతుకగా ప్రజల్లో నిలవాలన్నదే ఆశ, కాషాయం కండువా కప్పుకునేందుకు కత్తి కార్తీక రెడీ

న్యూస్ ఛానల్ యాంకర్, బిగ్ బాస్ ఫేమ్ కత్తి కార్తీక త్వరలో బీజేపీలో చేరే సూచనలు ప్రస్పుటంగా కనిపిస్తున్నాయి. తాజాగా ఆమె కేంద్ర హోంశాఖ సహాయమంత్రి, తెలంగాణ బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆయనతో చర్చల అనంతరం కార్తీక పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. తాను కిషన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశానని… రెండు, మూడు రోజుల్లో పార్టీ మార్పుపై తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని ఆమె తన ఫేస్ బుక్ అకౌంట్ […]

ప్రశ్నించే గొంతుకగా ప్రజల్లో నిలవాలన్నదే ఆశ, కాషాయం కండువా కప్పుకునేందుకు కత్తి కార్తీక రెడీ
Follow us

|

Updated on: Nov 21, 2020 | 5:31 PM

న్యూస్ ఛానల్ యాంకర్, బిగ్ బాస్ ఫేమ్ కత్తి కార్తీక త్వరలో బీజేపీలో చేరే సూచనలు ప్రస్పుటంగా కనిపిస్తున్నాయి. తాజాగా ఆమె కేంద్ర హోంశాఖ సహాయమంత్రి, తెలంగాణ బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆయనతో చర్చల అనంతరం కార్తీక పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. తాను కిషన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశానని… రెండు, మూడు రోజుల్లో పార్టీ మార్పుపై తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని ఆమె తన ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. కాగా, ఇటీవల జరిగిన దుబ్బాక బై పోల్ లో కార్తీక ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీ చేశారు. తన ప్రచారంలో అధికార పార్టీపై ఘాటైన విమర్శలు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. అధికార పార్టీ నేతలు తనను అనేక విధాలుగా అడ్డుకోవడానికి ప్రయత్నించారని.. అనేక ప్రలోభాలకు గురి చేశారంటూ కూడా ఆమె ఆరోపణలు గుప్పించారు. ప్రశ్నించే గొంతుకగా ప్రజల్లో నిలవాలన్నదే తన ఆశని ఆమె తన ప్రచారంలో ప్రముఖంగా ప్రస్తావించారు. కాగా, ఆ ఉపఎన్నికల్లో ఆమె 630 ఓట్లు సాధించారు.