ప్రమాణ స్వీకారం చేసిన కొత్త ఎమ్మెల్సీలు

తెలంగాణలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు శాసనమండలిలో ఈ రోజు ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. మండలి ఇన్‌ఛార్జి ఛైర్మన్‌ నేతి విద్యాసాగర్‌ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. శాసన సభ్యుల కోటా కింద హోం మంత్రి మహమూద్ అలీ, శేరి సుభాష్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌, యెగ్గె మల్లేశంలు టీఆర్ఎస్‌ తరపున, మీర్జా రియాజ్‌ హసన్‌ మజ్లిస్‌ నుంచి గెలిచారు. నల్గొండ-వరంగల్‌-ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి నర్సిరెడ్డి, కరీంనగర్‌-మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి కూర రఘోత్తంరెడ్డి, కరీంనగర్‌-మెదక్‌- నిజామాబాద్‌-ఆదిలాబాద్‌ […]

ప్రమాణ స్వీకారం చేసిన కొత్త ఎమ్మెల్సీలు
Follow us

| Edited By:

Updated on: Apr 15, 2019 | 2:35 PM

తెలంగాణలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు శాసనమండలిలో ఈ రోజు ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. మండలి ఇన్‌ఛార్జి ఛైర్మన్‌ నేతి విద్యాసాగర్‌ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. శాసన సభ్యుల కోటా కింద హోం మంత్రి మహమూద్ అలీ, శేరి సుభాష్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌, యెగ్గె మల్లేశంలు టీఆర్ఎస్‌ తరపున, మీర్జా రియాజ్‌ హసన్‌ మజ్లిస్‌ నుంచి గెలిచారు. నల్గొండ-వరంగల్‌-ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి నర్సిరెడ్డి, కరీంనగర్‌-మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి కూర రఘోత్తంరెడ్డి, కరీంనగర్‌-మెదక్‌- నిజామాబాద్‌-ఆదిలాబాద్‌ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి జీవన్‌రెడ్డి విజయం సాధించారు.