న్యూజిల్యాండ్లో మళ్లీ పెరుగుతోన్న కరోనా కేసులు
ప్రధానమంత్రి జసిందా ఆర్డెర్న్ శుక్రవారం న్యూజిలాండ్ యొక్క అతిపెద్ద నగరం ఆక్లాండ్లో 12 రోజులపాటు లాక్డౌన్ను పొడిగించారు. దేశంలో కరోనావైరస్ కేసులను గుర్తించడానికి, వ్యాధి వ్యాప్తిని నియంత్రించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. అనూహ్యంగా మొదలైన వ్యాప్తి రెండవ దశకు చేరకుండా నిరోధించడానికి ఆగస్టు 26 వరకు ఆక్లాండ్లో స్టే-ఎట్-హోమ్ ఆర్డర్లు అమలులో ఉంటాయని ఆర్డెర్న్ చెప్పారు. ఈ సంవత్సరం ప్రారంభంలో న్యూజిలాండ్లో నమోదైన కరోనావైరస్ కేసులు, తాజా కేసులతో సంబంధం లేదని అధికారులు నిర్ధారించారు. మంగళవారం ఒక […]
ప్రధానమంత్రి జసిందా ఆర్డెర్న్ శుక్రవారం న్యూజిలాండ్ యొక్క అతిపెద్ద నగరం ఆక్లాండ్లో 12 రోజులపాటు లాక్డౌన్ను పొడిగించారు. దేశంలో కరోనావైరస్ కేసులను గుర్తించడానికి, వ్యాధి వ్యాప్తిని నియంత్రించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. అనూహ్యంగా మొదలైన వ్యాప్తి రెండవ దశకు చేరకుండా నిరోధించడానికి ఆగస్టు 26 వరకు ఆక్లాండ్లో స్టే-ఎట్-హోమ్ ఆర్డర్లు అమలులో ఉంటాయని ఆర్డెర్న్ చెప్పారు. ఈ సంవత్సరం ప్రారంభంలో న్యూజిలాండ్లో నమోదైన కరోనావైరస్ కేసులు, తాజా కేసులతో సంబంధం లేదని అధికారులు నిర్ధారించారు.
మంగళవారం ఒక కుటుంబంలోని నలుగురు వ్యక్తులు పాజిటివ్ అని తేలింది. దీంతో అక్కడ కొత్త కేసు లేకుండా 102 రోజుల పాటు తీసుకున్న కట్టడి చర్యలకు బ్రేక్ పడింది. న్యూజిలాండ్ ఇప్పుడు ఒక క్లస్టర్లో 30 వైరస్ కేసులను గుర్తించింది. కాగా ఆ దేశంలో ఇప్పటివరకు వైరస్ కారణంగా 22 మంది ప్రాణాలు కొల్పోయారు.