క్లీన్ స్వీప్పై కివీస్ గురి.. 3వ వన్డేలో మూడు మార్పులతో బరిలోకి
టీ20 సిరిస్ను క్లీన్ స్వీప్ చేసి..మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఉన్న టీమిండియాకు..వన్డే సిరిస్లో కివీస్ ఝలక్ ఇచ్చింది. మూడు వన్డేల సిరిస్లో భాగంగా ఇప్పటికే రెండు మ్యాచులు గెలిచి సత్తా చాటింది. ఇక మంగళవారం జరగబోయే మూడు వన్డేలోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని భారత్ ఆశిస్తోంది. అది కూడా తన్నుకుపోయి..టీ20 వైట్ వాష్కు ప్రతీకారం తీర్చుకోవాలని కివీస్ యత్నిస్తుంది. రెండు టీమ్స్ ఈ సారి భారీ గేమ్ ప్లాన్తో సిద్దమయ్యాయి. అయినే న్యూజిలాండ్ టీమ్ను గాయాలు వేధిస్తున్నాయి. మిషెల్ […]
టీ20 సిరిస్ను క్లీన్ స్వీప్ చేసి..మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఉన్న టీమిండియాకు..వన్డే సిరిస్లో కివీస్ ఝలక్ ఇచ్చింది. మూడు వన్డేల సిరిస్లో భాగంగా ఇప్పటికే రెండు మ్యాచులు గెలిచి సత్తా చాటింది. ఇక మంగళవారం జరగబోయే మూడు వన్డేలోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని భారత్ ఆశిస్తోంది. అది కూడా తన్నుకుపోయి..టీ20 వైట్ వాష్కు ప్రతీకారం తీర్చుకోవాలని కివీస్ యత్నిస్తుంది. రెండు టీమ్స్ ఈ సారి భారీ గేమ్ ప్లాన్తో సిద్దమయ్యాయి. అయినే న్యూజిలాండ్ టీమ్ను గాయాలు వేధిస్తున్నాయి. మిషెల్ సాంట్నర్, టిమ్ సౌతీ, స్కాట్ కుగిలైన్ ఇప్పటికే గాయాల భారిన పడ్డారు.
అందుకే మూడో వన్డేలో.. పేసర్ బ్లెయిర్ టిక్నర్, లెగ్ స్పిన్నర్ ఇష్ సోధీలను టీమ్లోకి తీసుకున్నారు. అలాగే గత కొంతకాలంగా భుజం గాయంలో బాధపడుతోన్న కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా మ్యాచ్ ఆడేందుకు రెడీ అయిపోయాడు. గాయం కారణంగా లాస్ట్ రెండు టీ20 మ్యాచ్లతో పాటు ఫస్ట్ అండ్ సెకండ్ వన్డేలకు కూడా అతడు దూరమయ్యాడు. కేన్ పునరాగమనం కివీస్కు బాగా కలిసొచ్చే అంశం. భారత్ కూడా రెండు, మూడు మార్పులతో పోరుకు సిద్దమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.