కొత్త సంవత్సరానికి ముస్తాబైన జంటనగరాలు!
కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పేందుకు జంటనగరాలు ముస్తాబయ్యాయి. ప్రైవేట్ ఈవెంట్లు, పబ్బులు, క్లబ్బులు కొత్త సంవత్సరం వేడుకలకు వేదికలు అవుతున్నాయి. కాగా.. ఇండివిడ్యువల్ పార్టీలకు వేదిక అవుతోంది నెక్లెస్ రోడ్. ప్రతి కూడలి వద్ద కొత్త సంవత్సరాన్ని వెల్కమ్ చెప్తూ యువత సంబరాలు చేయబోతోంది. రోజు వారి సమయం కంటే ఈరోజు లిక్కర్ షాప్లు ఒక గంటసేపు ఎక్కువగా తెరిచి ఉంటాయి. సంబరాలు చేసుకునేందుకు యువత ముందస్తు ప్రణాళికలు చేస్తుంటే పోలీసుల ఆంక్షలు ఎక్కడికక్కడ విధిస్తున్నారు. సెలబ్రేషన్స్ […]
కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పేందుకు జంటనగరాలు ముస్తాబయ్యాయి. ప్రైవేట్ ఈవెంట్లు, పబ్బులు, క్లబ్బులు కొత్త సంవత్సరం వేడుకలకు వేదికలు అవుతున్నాయి. కాగా.. ఇండివిడ్యువల్ పార్టీలకు వేదిక అవుతోంది నెక్లెస్ రోడ్. ప్రతి కూడలి వద్ద కొత్త సంవత్సరాన్ని వెల్కమ్ చెప్తూ యువత సంబరాలు చేయబోతోంది. రోజు వారి సమయం కంటే ఈరోజు లిక్కర్ షాప్లు ఒక గంటసేపు ఎక్కువగా తెరిచి ఉంటాయి.
సంబరాలు చేసుకునేందుకు యువత ముందస్తు ప్రణాళికలు చేస్తుంటే పోలీసుల ఆంక్షలు ఎక్కడికక్కడ విధిస్తున్నారు. సెలబ్రేషన్స్ తర్వాత ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. న్యూఇయర్ సెలబ్రేషన్స్ను దృష్టిలో ఉంచుకొని రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు జంటనగరాల్లోని అన్ని ఫ్లై ఓవర్లను మూసి వేయనున్నారు పోలీసులు.
సెలబ్రేషన్స్కు వెళ్లే మహిళలు కచ్చితంగా పోలీసుల ఫోన్ నెంబర్లను ఫీడ్ చేసుకుని ఉండాలని వారు సూచించారు. అలాగే ఒక్కరే పార్టీలకు వెళ్లకుండా స్నేహితులతో, బంధువులతో వెళ్లాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నగరంలోని 32 కూడళ్లలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించనున్నారు పోలీసులు. ఇదిలా ఉంటే మందుబాబులకు మెట్రో బంపర్ ఆఫర్ ఇచ్చింది మద్యం సేవించిన అసభ్యకరంగా ప్రవర్తించకుండా ఉంటే రాత్రి రెండు గంటల వరకు మెట్రోలో ప్రయాణం చేయవచ్చని సూచించింది.
2019 గుడ్ బాయ్ చెప్తూ 2020 ఆహ్వానించే వారికి సూచనలు చేసింది పోలీసు శాఖ. ఈవెంట్ల కోసం వెళ్లేవారు కచ్చితంగా ఇంకొకరిని తోడు తీసుకెళ్లాలని.. ఒక్కరికి ఎంట్రీ ఇవ్వొద్దని ఈవెంట్ మేనేజర్లకు సూచించింది. కాగా.. గతం కంటే పోలిస్తే ఈ సంవత్సరం సంబరాలు చేసుకునేందుకు యువత మొగ్గు చూపుతున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఈవెంట్లు జరగడం లేదు.
పోలీస్ శాఖ ఆంక్షలతో ఎక్సైజ్ శాఖ మూడింతల రుసుము పెంచింది. దీంతో ఈవెంట్ మేనేజర్లను కాస్త వెనక్కి తగ్గేలా చేశాయి. ఏది ఏమైనా ఈ 2020 వెల్కమ్ చెప్పే వాళ్లు కచ్చితంగా పోలీసుల సూచనలు పాటించాలని ఇప్పటికే పోలీసు శాఖ కోరింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో మితిమీరి తాగి డ్రైవ్ చేసేవారికి 10 వేల జరిమానాతో పాటు కోర్టులో తప్పక హాజరవ్వాలని ప్రణాళికలు రూపొందించారు పోలీసులు.