జూబ్లీహిల్స్‌ పబ్‌ ఘటనలో కొత్త ట్విస్ట్!

నిన్న హైదరాబాద్ లోని టాట్ పబ్ పై పోలీసులు దాడులు చేసిన విషయం విదితమే. పబ్ లో యువతులతో అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారన్న సమాచారంతో సోదాలు నిర్వహించి, పలువురు యువతులను అరెస్టు చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా.. ఈ ఘటనలో నిజానిజాలు బయటపడుతున్నాయి. సిగ్నోవా ఫార్మా కంపెనీ తమ సేల్స్‌ పెంచుకునేందుకు డాక్టర్లు, ఉద్యోగుల కోసం ఈ పబ్ ను బుక్ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. 22 మంది యువతులతో అశ్లీల నృత్యాలు, […]

జూబ్లీహిల్స్‌ పబ్‌ ఘటనలో కొత్త ట్విస్ట్!
Follow us

| Edited By:

Updated on: Jan 13, 2020 | 10:01 PM

నిన్న హైదరాబాద్ లోని టాట్ పబ్ పై పోలీసులు దాడులు చేసిన విషయం విదితమే. పబ్ లో యువతులతో అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారన్న సమాచారంతో సోదాలు నిర్వహించి, పలువురు యువతులను అరెస్టు చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

కాగా.. ఈ ఘటనలో నిజానిజాలు బయటపడుతున్నాయి. సిగ్నోవా ఫార్మా కంపెనీ తమ సేల్స్‌ పెంచుకునేందుకు డాక్టర్లు, ఉద్యోగుల కోసం ఈ పబ్ ను బుక్ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. 22 మంది యువతులతో అశ్లీల నృత్యాలు, వ్యభిచారం నిర్వహిస్తున్నారని తెలిసింది. ఈవెంట్‌ ఆర్గనైజర్‌ ప్రసాద్‌ ప్రతి ఏటా రేవ్‌ పార్టీలు ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పట్టుబడ్డ యువతులంతా నెల్లూరుకు చెందిన వారితో పాటు ముంబయి వారు కూడా ఉన్నట్లు గుర్తించారు.