30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ఎపిసోడ్లో న్యూ ట్విస్ట్! దిమ్మ తిరిగే విషయాలు
ప్రస్తుతం ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ ఆడియో టేపుల వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. ఓ మహిళా ఉద్యోగినితో పృథ్వీ మాట్లాడిన ఓ ఆడియో రికార్డు విషయం సంచలనంగా మారింది. దీనిపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆరా తీసి.. విచారణకు ఆదేశించారు. దీంతో నిజం తేలేదాక నేను ఆ పదవిలో ఉండనని పృథ్వీ రాజీనామా చేశారు. తన తప్పు లేకపోతేనే తిరిగి విధుల్లో చేరుతానని పృథ్వీ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయనపై టీటీడీ విచారణ కొనసాగిస్తోంది. ఇందులో పలు […]
ప్రస్తుతం ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ ఆడియో టేపుల వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. ఓ మహిళా ఉద్యోగినితో పృథ్వీ మాట్లాడిన ఓ ఆడియో రికార్డు విషయం సంచలనంగా మారింది. దీనిపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆరా తీసి.. విచారణకు ఆదేశించారు. దీంతో నిజం తేలేదాక నేను ఆ పదవిలో ఉండనని పృథ్వీ రాజీనామా చేశారు. తన తప్పు లేకపోతేనే తిరిగి విధుల్లో చేరుతానని పృథ్వీ పేర్కొన్నారు.
ప్రస్తుతం ఆయనపై టీటీడీ విచారణ కొనసాగిస్తోంది. ఇందులో పలు ట్విస్ట్లు వెలుగులోకి వస్తున్నాయి. టాలీవుడ్కి చెందిన ఇద్దరి మహిళల ప్రమేయం ఇందులో ఉన్నట్లు పలు పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే ఆడియోలో పృథ్వీతో పాటు మాట్లాడిన సదరు ఎస్వీబీసీ మహిళా ఉద్యోగిని ఎవరనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. అయితే.. దీనిపై ఆ మహిళ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో కేసులో పీటముడి నెలకొంది. అలాగే.. పృథ్వీ ఎస్వీబీసీలో అక్రమంగా చేపట్టిన ఉద్యోగ నియామకాల అంశం కూడా తెరపైకి రావడంతో దానిపైనా అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే ఇప్పుడు విజిలెన్స్ నివేదికపై పృథ్వీ భవిష్యత్తు ఆధారపడి ఉంది.