మరో ట్విస్ట్.. కుటుంబ సభ్యులు కొట్టడంతో ఆత్మహత్య చేసుకున్న శ్రావణి
సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. టిక్టాక్లో పరిచయమైన దేవరాజ్ రెడ్డి
Sravani Suicide case: సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. టిక్టాక్లో పరిచయమైన దేవరాజ్ రెడ్డి వేధింపుల కారణంగానే తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని శ్రావణి తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం అతడు ఎస్సార్ నగర్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ క్రమంలో అతడు పోలీసులకు పలు కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. మరోవైపు సాయికృష్ణ, శ్రావణి కుటుంబ సభ్యులు కొట్టడంతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు తేలింది. ఈ మేరకు శ్రావణి, దేవరాజ్తో మాట్లాడిన ఆడియో టేపులను బయటకు వచ్చాయి.
తన చావుకు సాయి కారణమని శ్రావణి చివరిసారిగా మాట్లాడిన మాటలు సాక్ష్యాలు బయటకు వచ్చాయి. అంతేకాదు గతంలో దేవరాజ్ని, సాయి రక్తం వచ్చేలా కొట్టినట్లు కూడా తేలింది. ఇక సాయి అమ్మాయిలను ట్రాప్ చేస్తాడని, అలానే శ్రావణిని కూడా ట్రాప్ చేశాడని దేవరాజ్ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. తన నుంచి విడిపోవాలంటూ శ్రావణిని వేధింపులకు గురిచేసినట్లు దేవరాజ్ తెలిపినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ కేసులో ఆర్ఎక్స్100 నిర్మాత అశోక్రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. కాగా ఈ కేసులో దోషులు ఎవరైనా శిక్ష తప్పదని, పోలీసులు చెబుతున్నారు.
Read More:
నిరాశ చెందాల్సిన అవసరం లేదు: ఆక్స్ఫర్డ్ టీకా నిలిపివేతపై డబ్ల్యూహెచ్ఓ