RS seat for BJP: రాజ్యసభ సీటు కేటాయింపులో కొత్త ట్విస్టు

ఏపీలో రాజ్యసభ సీటు కేటాయింపులో కొత్త ట్విస్టు వెలుగు చూస్తోంది. ఖాళీ అవుతున్న నాలుగు సీట్లకుగాను ఓ టిక్కెట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా ఆ సీటు కేటాయింపు వెనకాల వున్న సీక్రెట్.. అద్భుతమైన గేమ్ ప్లాన్‌పై ఇంటర్నల్ మ్యాటర్ వెలుగు చూస్తోంది.

RS seat for BJP: రాజ్యసభ సీటు కేటాయింపులో కొత్త ట్విస్టు
Follow us

|

Updated on: Mar 06, 2020 | 6:47 PM

New twist in Rajyasabha seat allocation: ఏపీలో రాజ్యసభ సీటు కేటాయింపులో కొత్త ట్విస్టు వెలుగు చూస్తోంది. ఖాళీ అవుతున్న నాలుగు సీట్లకుగాను ఓ టిక్కెట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా ఆ సీటు కేటాయింపు వెనకాల వున్న సీక్రెట్.. అద్భుతమైన గేమ్ ప్లాన్‌పై ఇంటర్నల్ మ్యాటర్ వెలుగు చూస్తోంది. దానిపై విశ్లేషకుల అంఛనాలకు రీజనింగ్ లభిస్తోంది.

ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారు నలుగురు రిటైర్ అవుతుండడంతో ఆ నాలుగు సీట్లకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. మార్చి 13వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.. ఏకగ్రీవమైతే మార్చి 18న ప్రకటిస్తారు. అయితే.. ఏపీ నుంచి ఖాళీ అవుతున్న వాటి నుంచి ఒక సీటును బీజేపీ అడిగినట్లు ప్రచారం జోరుగా జరిగింది. అందుకే జగన్ ఢిల్లీ వెళ్ళి మరీ ప్రధాని మోదీ, అమిత్‌షాలను కలిసి వచ్చారని అనుకున్నారంతా.

మూడు రాజధానుల అంశానికి, మండలి రద్దుకు కేంద్రం మద్దతునివ్వాలంటే తమకు ఓ రాజ్యసభ సీటు కేటాయించాలని బీజేపీ నేతలు కండీషన్ పెట్టినట్లు ప్రచారం జరిగింది. ఈ ప్రచారం జోరుగా కొనసాగుతుండగానే.. సడన్‌గా రిలయెన్స్ అధినేత ముఖేశ్ అంబానీ అమరావతికి వచ్చి మరీ ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు. ఇదేదో పెట్టుబడుల పెట్టేందుకో… కేజీ గ్యాస్ బేసిన్ గురించో అని కొందరన్నారు. కానీ అంబానీ వెంట రాజ్యసభ బెర్త్ రెన్యువల్ కోసం ప్రయత్నిస్తున్న పరిమళ్ నత్వానీ కూడా ముఖేశ్ అంబానీ వెంట వచ్చారు. దాంతో మరో కోణం చర్చకొచ్చింది.

నత్వానీని గతంలో ఝార్ఖండ్ నుంచి రాజ్యసభకు నామినేట్ చేశారు. తొలిసారి పరిమళ్ నత్వానీ 2008లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2014లో ఝార్ఖండ్ నుంచి రెండోసారి రాజ్యసభ మెట్లెక్కారు. ప్రస్తుతం ఝార్ఖండ్ నుంచి తిరిగి నామినేట్ చేసే పరిస్థితి లేకపోవడంతో ఏపీ నుంచి వైసీపీ కోటాలో రాజ్యసభకు పంపించేందుకే అంబానీ స్వయంగా వచ్చి జగన్‌ను కలిశారంటూ కథనాలు మొదలయ్యాయి. నత్వానీ అంటే ముఖేశ్ అంబానీకి విపరీతమైన గురి అని చెబుతూ వుంటారు. 64 ఏళ్ళ నత్వానీ తన యుక్త వయసులోనే ముఖేశ్ అంబానీ తండ్రి ధీరూభాయ్ అంబానీతో కలిసి పనిచేయడంతో ముఖేశ్… నత్వానీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తారని చెప్పుకుంటారు.

ట్విస్టు ఇదే..

నిజానికి అంబానీ తరపున రాయభారం జరిపింది అమిత్‌షా, మోదీలేనని తాజాగా అందుతున్న సమాచారం. ముందుగా వీరిద్దరు ఏపీ నుంచి వైసీపీ కోటాలో పరిమళ్ నత్వానీని రాజ్యసభకు ఎన్నికయ్యేలా చూడాలని బీజేపీ అధినేతలు జగన్‌ను కోరినట్లు తెలుస్తోంది. వారి విఙ్ఞప్తిపై పార్టీ సీనియర్లతోను, తన రాజకీయ సలహాదారులతోను సంప్రదింపులు జరిపిన తర్వాత జగన్ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

నత్వానీని ఏపీ నుంచి రాజ్యసభకు పంపేందుకు జగన్ సుముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలోనే ముఖేశ్ అంబానీ స్వయంగా అమరావతికి తరలి వచ్చి.. ఫార్మల్‌గా వైసీపీ అధినేతను కలిశారని తెలుస్తోంది. బీజేపీ రాయభారం జరిపి.. కన్‌ఫర్మ్ చేసిన తర్వాతనే ఫార్మల్ మీటింగ్‌కోసం ముఖేశ్ వచ్చారని అంటున్నారు. లేకపోతే.. జాతీయ రాజకీయాలను శాసించే.. ముఖేశ్ అంబానీ చిన్ని రాజ్యసభ టిక్కెట్ కోసం స్వయంగా రంగంలోకి దిగరని, ముందుగా కేంద్రం పెద్దలతో రాయభారం జరిపి, కన్‌ఫర్మ్ చేయించుకున్న తర్వాతనే ఫార్మల్‌గా ఇన్‌వాల్వ్ అయ్యారని అంటున్నారు. ఈ ప్రచారంలో నిజమెంతో తేలాలంటే మరో వారం రోజులు ఆగాల్సిందేనంటున్నారు పరిశీలకులు.

ఇదీ చదవండి: అధినేతలిద్దరికి అగ్నిపరీక్ష Litmus test for YCP, TRS chiefs

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.