హేమంత్ హత్య వెనుక మరో ఇద్దరు..!
హేమంత్ హత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. తన భర్త హత్యలో గూడూరు సందీప్ రెడ్డి, ఆశిష్ రెడ్డిల ప్రమేయం కూడా ఉందంటూ అవంతి ఆరోపిస్తోంది.
Hemanth Murder Case: హేమంత్ హత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. తన భర్త హత్యలో గూడూరు సందీప్ రెడ్డి, ఆశిష్ రెడ్డిల ప్రమేయం కూడా ఉందంటూ అవంతి ఆరోపిస్తోంది. నెల రోజుల కిందట తన దగ్గర నుంచి రెండు లక్షలు అప్పు తీసుకున్నారంటూ హేమంత్ తండ్రితో సందీప్ రెడ్డి బెదిరింపులకు దిగాడని అవంతి తెలిపారు.
సందీప్ రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని తెలిపిన అవంతి.. రక్షణ కల్పించాలంటూ కోరింది. ఇక హేమంత్ కిడ్నాప్ అయిన రోజున గచ్చిబౌలి పోలీసులు సందీప్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, హేమంత్ను అవంతి మేనమామ యుగంధర్ రెడ్డి కిరాయి గుండాలతో హత్య చేయించాడు. యుగంధర్తో పాటు 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read:
మందుబాబులకు కిక్కిచ్చే వార్త.. ఆన్లైన్లో మద్యం అమ్మకాలు.!
బ్రూసెల్లోసిస్… తస్మాత్ జాగ్రత్త.!
ఏపీలో కొత్త ఎక్సైజ్ పాలసీ.. ఆ ప్రదేశాల్లో లిక్కర్ షాపులకు నో పర్మిషన్..