బోటు మిస్సింగ్ కేసులో కొత్త ట్విస్ట్…. రంగంలోకి కాకినాడ బ్యాచ్… !!

తూర్పుగోదావరి జిల్లా కచ్చలూరు  గోదావరిలో మునిగిపోయిన లాంచీ విషయంలో కొత్త ట్విస్ట్. కచ్చులూరులో ప్రమాదానికి గురైన బోటును వెలికి తీస్తామంటూ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ను కాకినాడకు చెందిన శ్రీనివాస్ బృందం కలిసింది. కలెక్టర్ సూచన మేరకు కచ్చులూరులో ప్రమాదానికి గురైన బోటు ప్రదేశాన్ని పరిశీలించారు. నదిలో నుంచి బోటును బయటికి తీసేందుకు అవసరమైన సామాగ్రి, పరికరాలు తమ వద్ద ఉన్నాయంటూ  శ్రీనివాస్ బృందం కలెక్టర్‌కు తెలిపింది. గతంలో సముద్రంలో మునిగిపోయిన షిప్పులను వెలికి తీసిన అనుభవం ఉందంటున్న శ్రీనివాస్..అందుకు సంబంధించిన […]

బోటు మిస్సింగ్ కేసులో కొత్త ట్విస్ట్.... రంగంలోకి కాకినాడ బ్యాచ్... !!
Follow us

|

Updated on: Sep 25, 2019 | 9:35 PM

తూర్పుగోదావరి జిల్లా కచ్చలూరు  గోదావరిలో మునిగిపోయిన లాంచీ విషయంలో కొత్త ట్విస్ట్. కచ్చులూరులో ప్రమాదానికి గురైన బోటును వెలికి తీస్తామంటూ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ను కాకినాడకు చెందిన శ్రీనివాస్ బృందం కలిసింది. కలెక్టర్ సూచన మేరకు కచ్చులూరులో ప్రమాదానికి గురైన బోటు ప్రదేశాన్ని పరిశీలించారు. నదిలో నుంచి బోటును బయటికి తీసేందుకు అవసరమైన సామాగ్రి, పరికరాలు తమ వద్ద ఉన్నాయంటూ  శ్రీనివాస్ బృందం కలెక్టర్‌కు తెలిపింది.

గతంలో సముద్రంలో మునిగిపోయిన షిప్పులను వెలికి తీసిన అనుభవం ఉందంటున్న శ్రీనివాస్..అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలను కలెక్టర్‌కు చూపించారు.  నాలుగు బోట్లు, ఒక జెసిబి సాయంతో  25 మంది బృందంగా ఏర్పడి బోటును వెలికి తీస్తామని వారు చెప్తున్నారు. గతంలో రెండు వేల టన్నుల బరువున్న షిప్పులనే బయటికి తీశామని…30 టన్నులు ఉండే బోటు కూడా కచ్చితంగా వెలికి తీస్తామని వారు పేర్కొన్నారు.  30 సంవత్సరాల నుంచి నీటిలో మునిగిపోయిన బోట్లను, పెద్ద పెద్ద షిప్పులను కూడా వెలికి తీశామని..  గత బోటు ప్రమాదాలకు సంబంధించిన ఉదాహారణలను వారు వివరిస్తన్నారు. మరి శ్రీనివాస్ అభ్యర్థనపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

కాగా తమ వారి ఆచూకి కోసం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి మార్చురీ వద్ద బాధితుల బంధువులు పడిగాపులు కాస్తున్నారు. బోటు వెలికితీస్తారేమో.. అందులో తమవారి ఆచూకి లభిస్తుందేమోనని ఆశగా ఎదురు చూస్తున్నారు. కాగా కొందరు తమవాళ్ల ఆచూకి దొరక్కపోయినా..ఆశలు వదులుకోని కర్మకాండలు నిర్వహిస్తున్నారు.

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో బోటు మునిగి గల్లంతైన వారిలో మంచిర్యాలకు చెందిన యువ ఇంజనీర్ రమ్య కూడా ఉన్నారు. ఇంకా ఆమె ఆచూకీ తెలియరాలేదు. వస్తుందన్న ఆశలు కూడా సన్నగిల్లడంతో రమ్యశ్రీ తండ్రి తన కూతురికి శాస్త్రోక్తంగా కర్మకాండలు నిర్వహించారు. పది రోజులు దాటినా కుమార్తె ఆచూకీ తెలియకపోవడంతో ఆమె తండ్రి రాజమండ్రిలోని కోటి లింగాల ఘాట్‌ వద్ద కర్మకాండలు పూర్తి చేశారు.

చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..
చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..
కాంతార ప్రీక్వెల్‌లో ఆ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి ప్లాన్ అదేనా..
కాంతార ప్రీక్వెల్‌లో ఆ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి ప్లాన్ అదేనా..
చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!
చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!
చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ
చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ
ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..
ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!