ముంబైలో కొత్త రూల్.. పాటించకపోతే రూ. 10 వేలు ఫైన్ ..?
ముంబై ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు షాకిచ్చారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి రోడ్ల పై అక్రమంగా పార్కింగ్ చేసిన వాహనాలకు భారీ జరిమానా విధించారు. కాగా, మొత్తం 56 వాహనాలకు జరిమానా విధించారు. అందులో 9 కార్ల యజమానులు రూ.10,000 చొప్పున చెల్లించారు. మిగిలిన వారు పెనాల్టీతో కలిపి త్వరలో చెల్లించే అవకాశం ఉంది. నో పార్కింగ్ జోన్లో వాహనం నిలిపితే కనిష్ఠంగా రూ. 5000 నుంచి గరిష్ఠంగా రూ. 23000 వరకు జరిమానా కట్టాల్సి ఉంటుంది. నగరంలో […]
ముంబై ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు షాకిచ్చారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి రోడ్ల పై అక్రమంగా పార్కింగ్ చేసిన వాహనాలకు భారీ జరిమానా విధించారు. కాగా, మొత్తం 56 వాహనాలకు జరిమానా విధించారు. అందులో 9 కార్ల యజమానులు రూ.10,000 చొప్పున చెల్లించారు. మిగిలిన వారు పెనాల్టీతో కలిపి త్వరలో చెల్లించే అవకాశం ఉంది. నో పార్కింగ్ జోన్లో వాహనం నిలిపితే కనిష్ఠంగా రూ. 5000 నుంచి గరిష్ఠంగా రూ. 23000 వరకు జరిమానా కట్టాల్సి ఉంటుంది. నగరంలో ఇష్టారాజ్యంగా కొనసాగుతున్న వాహనాల పార్కింగ్ను అరికట్టేందుకు బృహన్ ముంబై కార్పొరేషన్, ముంబై ట్రాఫిక్ పోలీసులు ఈ నిబంధనలను అమల్లోకి తెచ్చారు.