తెలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. ?

ఉభయ తెలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించాలని కేంద్రం యోచిస్తోంది. తెలంగాణకు కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్‌ను. ఆంధ్ర ప్రదేశ్‌కు పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్న కిరణ్ బేడీని నియమించే సూచనలున్నాయని తెలుస్తోంది. కాగా, ప్రధాని మోదీ కొత్త కేంద్ర మంత్రి వర్గంలో సుష్మా స్వరాజ్‌ను తీసుకోకపోవడం.. మరో వైపు రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్‌గా ఉన్న నరసింహన్ పదవీ కాలాన్నీ ఎప్పటికప్పుడు పొడిగిస్తున్న నేపథ్యంలో ఈ మార్పులు జరుగుతాయని భావిస్తున్నారు. […]

తెలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. ?
Follow us

| Edited By:

Updated on: Jun 10, 2019 | 2:10 PM

ఉభయ తెలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించాలని కేంద్రం యోచిస్తోంది. తెలంగాణకు కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్‌ను. ఆంధ్ర ప్రదేశ్‌కు పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్న కిరణ్ బేడీని నియమించే సూచనలున్నాయని తెలుస్తోంది.

కాగా, ప్రధాని మోదీ కొత్త కేంద్ర మంత్రి వర్గంలో సుష్మా స్వరాజ్‌ను తీసుకోకపోవడం.. మరో వైపు రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్‌గా ఉన్న నరసింహన్ పదవీ కాలాన్నీ ఎప్పటికప్పుడు పొడిగిస్తున్న నేపథ్యంలో ఈ మార్పులు జరుగుతాయని భావిస్తున్నారు. అయితే దీనిపై ఇంకా అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.