అయోధ్యకేసుపై కీలక వ్యాఖ్యలు..కొత్త సీజె ఏమన్నారంటే?
సుదీర్ఘ కాలంగా నానుతున్న అయోధ్య కేసులో త్వరలో తీర్పు వెలువడనున్న తరుణంలో సుప్రీం కోర్టుకు కాబోయే ప్రధాన న్యాయమూర్తి శరద్ అరవింద్ బొబ్డే అత్యంత కీలకమైన కామెంట్లు చేశారు. అక్టోబర్ 16న వాదనలు ముగిసిన, కేసు రిజర్వు చేసిన నేపథ్యంలో అటు అయోధ్యలోను, ఇటు దేశ రాజధానిలోకి కొన్ని సున్నిత ప్రాంతాల్లోను టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈక్రమంలో కాబోయే చీఫ్ జస్టిస్ బొబ్డే అయోధ్య కేసు విషయంలో చేసిన కామెంట్లు దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపాయి. 1992 డిసెంబర్ […]
సుదీర్ఘ కాలంగా నానుతున్న అయోధ్య కేసులో త్వరలో తీర్పు వెలువడనున్న తరుణంలో సుప్రీం కోర్టుకు కాబోయే ప్రధాన న్యాయమూర్తి శరద్ అరవింద్ బొబ్డే అత్యంత కీలకమైన కామెంట్లు చేశారు. అక్టోబర్ 16న వాదనలు ముగిసిన, కేసు రిజర్వు చేసిన నేపథ్యంలో అటు అయోధ్యలోను, ఇటు దేశ రాజధానిలోకి కొన్ని సున్నిత ప్రాంతాల్లోను టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈక్రమంలో కాబోయే చీఫ్ జస్టిస్ బొబ్డే అయోధ్య కేసు విషయంలో చేసిన కామెంట్లు దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపాయి.
1992 డిసెంబర్ 6వ తేదీన వివాదాస్పద కట్టడాన్ని కూల్చి, రామ్ లల్లా గుడిని తాత్కాలికంగా నిర్మించిన దరిమిలా మొదలైన అయోధ్య కేసు విచారణ.. అంతకు దశాబ్దాలుగా నానుతున్న వివాదాన్ని కొత్త మలుపు తిప్పింది. ఆ తర్వాత సుదీర్ఘంగా సాగిన విచారణకు ఇక ముగింపు పలకాలని భావించిన సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజయ్ గగోయ్ తన సారథ్యంలోనే అయిదుగురు సభ్యులున్న సుప్రీం ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. ప్రతీ రోజు విచారిస్తామంటూ 40 రోజుల పాటు అందరి వాదనలు విన్నది ధర్మాసనం. ఈ వాదనల పర్వం ఇటీవల అక్టోబర్ 16వ తేదీన ముగిసింది. నవంబర్ 17నాటికి అంటే ధర్మాసనానికి సారథ్యం వహిస్తున్న చీఫ్ జస్టిస్ రంజయ్ గగోయ్ పదవీ విరమణ చేసే లోగా తీర్పు వెలువరిస్తామన్న సంకేతాలు స్పష్టంగా ఇచ్చారు.
ఈనేపథ్యంలోనే సుప్రీం కోర్టుకు కొత్త చీఫ్ జస్టిస్గా శరద్ అరవింద్ బొబ్డే నియమితులయ్యారు. ఆయన నవంబర్ 17న భారత అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈక్రమంలో ఆయన పలు జాతీయ మీడియా సంస్థలతో మాట్లాడారు. ‘‘అయోధ్య కేసు ప్రపంచ చరిత్రలోనే ఓ అతి కీలకమైన, అతి సున్నిత కేసుల్లో ఒకటి ’’ అని బొబ్డే అభిప్రాయపడ్డారు. త్వరలో పదవీ బాధ్యతలు చేపట్టబోతున్న తరుణంలో బొబ్డే అయోధ్య కేసుపై చేసిన ఈ వ్యాఖ్యలు సుప్రీం కోర్టు ఈ వివాదంపై త్వరలో ఏం తీర్పు చెప్పబోతుందో అన్ని ఉత్కంఠను రెట్టింపు చేశాయి.