సూర్యాపేటలో కొత్తగా 11 కరోనా కేసులు..
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ...
New Corona Cases Registered in Suryapet District : కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ రాష్ట్రంలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా కేసులు నమోదవుతున్నాయి. అదే స్థాయిలో జిల్లా కేంద్రాల్లోనూ కేసులు పెరుగుతున్నాయి.
తాజాగా సూర్యాపేట జిల్లాలో శుక్రవారం ఒక్కరోజే కొత్తగా 11 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య అధికారులు వెల్లడించారు. జిల్లాలో ఇప్పటి వరకు 157 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం 67 మంది కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నట్లు వైద్య అధికారులు చెప్పారు. సూర్యాపేట జిల్లాలో కరోనా వల్ల ముగ్గురు మృతి చెందారు.