Big Breaking : వివాదాస్పద మ్యాప్ కు నేపాల్ ఎగువ సభ ఆమోదం..!
ఇండియా తమకు చెందినవని చెప్పుకుంటున్న భూభాగాలను కూడా తమవేనని ప్రకటించుకునేందుకు ఉద్దేశించిన వివాదాస్పద 'మ్యాప్'కు నేపాల్ ఎగువ సభ ఆమోదం లభించింది.
ఇండియా తమకు చెందినవని చెప్పుకుంటున్న భూభాగాలను కూడా తమవేనని ప్రకటించుకునేందుకు ఉద్దేశించిన వివాదాస్పద ‘మ్యాప్’కు నేపాల్ ఎగువ సభ(జాతీయ అసెంబ్లీ)ఆమోదం లభించింది. బిల్లును ఆ దేశ ఎగువ సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇప్పటికే దిగువ సభలో బిల్లు ఆమోదం పొందింది. బిల్లుకు అనుకూలంగా 57 ఓట్లతో కొత్త మ్యాప్ సవరణ బిల్లు (కోట్ ఆఫ్ ఆర్మ్స్) ప్రతిపాదనను నేపాల్ ఎగువ సభ గురువారం ఏకగ్రీవంగా ఆమోదించినట్లు వార్తా సంస్థ ANI తెలిపింది. బిల్లుకు వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా పడలేదని వివరించింది.
Nepal: The New Map Amendment Bill (Coat of Arms) proposes change in the map of Nepal to include parts of Indian territory. https://t.co/lFhn6BW2DW
— ANI (@ANI) June 18, 2020
ఇండియా భూభాగాలైన కాలాపానీ, లిపులేఖ్, లింపుయాధురాలను… తమవిగా వివాదాస్పద కొత్త మ్యాప్ లో పేర్కొంది నేపాల్. ఈ విషయంలో భారత్ ఎంత వ్యతిరేకిస్తున్నా..చిరకాల స్నేహాన్ని సైతం పక్కనబెట్టి ముందడుగు వేసింది. గతవారం నేపాల్ పార్లమెంట్ దిగువ సభలో ఆమోదింపబడిన ఈ మ్యాప్..తాజాగా, ఎగువ సభలోనూ పాస్ అయ్యింది.