6 నెలలుగా వజ్రాల వేట…రూ. 50 లక్షల విలువైన డైమండ్ లభ్యం

ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి ఆరునెలలుగా వజ్రాల వేట కొనసాగిస్తున్నాడు. ఉదయం లేచింది మొదలు..రాత్రి వరకు తన తల్లిదండ్రులతో అక్కడి మట్టిని జల్లెడపడుతూనే గడిపాడు. ఎట్టకేలకు అతడి కష్టం ఫలించింది. రూ. 50 లక్షల విలువైన వజ్రం దొరికింది...

6 నెలలుగా వజ్రాల వేట...రూ. 50 లక్షల విలువైన డైమండ్ లభ్యం
Follow us

|

Updated on: Jul 22, 2020 | 4:24 PM

ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి ఆరునెలలుగా వజ్రాల వేట కొనసాగిస్తున్నాడు. ఉదయం లేచింది మొదలు..రాత్రి వరకు తన తల్లిదండ్రులతో అక్కడి మట్టిని జల్లెడపడుతూనే గడిపాడు. ఎట్టకేలకు అతడి కష్టం ఫలించింది. రూ. 50 లక్షల విలువైన వజ్రం దొరికింది. దాంతో అతడి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది.

వజ్రాలకు పెట్టింది పేరుగా ఉన్న మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలో ఎక్కువ మంది ప్రజలు వజ్రాల వేటనే వృత్తిగా కొనసాగిస్తుంటారు. గనులను లీజుకు తీసుకుని వజ్రాల కోసం వేట సాగిస్తారు. ఈ క్రమంలోనే ఆనందిలాల్‌ కుష్వాహ అనే వ్యక్తి రాణీపూర్‌ ప్రాంతంలో ఓ మైన్‌ను లీజుకు తీసుకుని నడిపిస్తున్నాడు. కొన్ని రోజుల కిందట అతడి కష్టం ఫలించి అత్యంత విలువైన వజ్రం దొరికింది. సుమారుగా రూ. 50 లక్షల విలువైన 10.69 క్యారెట్ల వజ్రం దొరికింది.

ఆరు నెలలుగా తాను, తన తల్లిదండ్రులు పడుతున్న కష్టానికి ఫలితం దక్కిందని అతడు సంతోషం వ్యక్తం చేశాడు. వజ్రాన్ని స్థానిక డైమండ్ కార్యాలయంలో (హీరా కార్యాలయ్) సమర్పించాడు. త్వరలో దాన్ని వేలం వేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రభుత్వ ట్యాక్స్‌లు, ఇతర ఖర్చులు పోను అతడికి కనీసం 50 లక్షల రూపాయలు వచ్చే అవకాశం ఉందని వజ్రాల వ్యాపారులు అంచనా వేస్తున్నారు.

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు