ఎన్డీటీవీ జర్నలిస్ట్ రవీష్కు మెగసెసే అవార్డు
ప్రముఖ జర్నలిస్టు, ఎన్డీటీవీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రవీష్ కుమార్ ప్రఖ్యాత రామన్ మెగసెనే అవార్డుకు ఎంపికయ్యారు. 2019 సంవత్సరానికి ఈ అవార్డును ఆయన గెలుచుకున్నట్టు మెగససే ఫౌండేషన్ ప్రకటించింది. 2019లో అవార్డు విజేతలు ఐదుగురిలో రావీష్ ఒకరు. మయన్మార్కు చెందిన కో స్వీ విన్, థాయ్లాండ్కు చెందిన అంగ్ఖానా నీలపైజిత్, ఫిలిప్పీన్స్కు చెందిన రేముండో పూజంటే కయాబ్యాబ్, దక్షిణ కొరియాకు చెందిన కిమ్ జోంగ్ కిలు కూడా ఈ అవార్డును అందుకోనున్నారు. రవీష్ ఈ […]
ప్రముఖ జర్నలిస్టు, ఎన్డీటీవీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రవీష్ కుమార్ ప్రఖ్యాత రామన్ మెగసెనే అవార్డుకు ఎంపికయ్యారు. 2019 సంవత్సరానికి ఈ అవార్డును ఆయన గెలుచుకున్నట్టు మెగససే ఫౌండేషన్ ప్రకటించింది. 2019లో అవార్డు విజేతలు ఐదుగురిలో రావీష్ ఒకరు. మయన్మార్కు చెందిన కో స్వీ విన్, థాయ్లాండ్కు చెందిన అంగ్ఖానా నీలపైజిత్, ఫిలిప్పీన్స్కు చెందిన రేముండో పూజంటే కయాబ్యాబ్, దక్షిణ కొరియాకు చెందిన కిమ్ జోంగ్ కిలు కూడా ఈ అవార్డును అందుకోనున్నారు.
రవీష్ ఈ అవార్డుకు ఎంపిక కావడంపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. జర్నలిజంలో ఆయన చూపిన చొరవకు గుర్తింపుగా మెగసెసే ఫౌండేషన్ ఈ అవార్డును అందజేయనుంది. ఫిలిప్పీన్స్ దేశ మాజీ అధ్యక్షుడు రామన్ మెగసెసే ఙ్ఞాపకార్ధం ఈ అవార్డును 1957 నుంచి ఇస్తున్నారు.