భారీ స్కామ్.. కోట్లు నష్టపోనున్న రమ్యకృష్ణ, నయనతార!
మోసపోవడం, మోసగించడం అన్నది ఈ ప్రపంచంలో సాధారణంగా జరిగే పనులే. అందులో సెలబ్రిటీలు ఏం మినహాయింపు కాదు. ఏదో వ్యాపారంలో పెట్టుబడి పెట్టి మోసపోయిన సెలబ్రిటీల లిస్ట్ చాలానే ఉంది.
మోసపోవడం, మోసగించడం అన్నది ఈ ప్రపంచంలో సాధారణంగా జరిగే పనులే. అందులో సెలబ్రిటీలు ఏం మినహాయింపు కాదు. ఏదో వ్యాపారంలో పెట్టుబడి పెట్టి మోసపోయిన సెలబ్రిటీల లిస్ట్ చాలానే ఉంది. ఇలా తాజాగా ఓ రియల్ ఎస్టేట్లో జరిగిన స్కామ్లో దక్షిణాది హీరోయిన్లు రమ్యకృష్ణ, నయనతార మోసపోయాయినట్లు తెలుస్తోంది. వేలు, లక్షలు కాదు కోట్లలో వీరు నష్టపోయినట్లు టాక్. వీరు మాత్రమే కాదు సచిన్ టెండూల్కర్ భార్య అంజలి సహా మరికొందరు సినీ, క్రికెట్ సెలబ్రిటీలు సైతం ఈ స్కామ్లో మోసపోయినట్లు సమాచారం.
వివరాల్లోకి వెళ్తే.. ఓ పేరు మోసిన రియల్ ఎస్టేట్ కంపెనీ దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులకు కొన్ని కోట్ల భూములను అమ్మింది. అంతేకాదు అక్కడ అపార్ట్మెంట్లు కట్టించేందుకు ప్రణాళికలు రచించింది. అయితే ఈ లోపే కంపెనీలోని భాగస్వామ్యుల మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో ఈ విషయం కాస్త బయటకు రాగా.. అవి వ్యవసాయ భూములని, అక్కడ ఎలాంటి భవనాలను నిర్మించకూడంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా సదరు కంపెనీ ఆ భూములను ఎకరాను లక్ష రూపాయలకు కొనుగోలు చేసి, పది కోట్లకు అమ్మినట్లు తేలింది. ఈ నేపథ్యంలో రెవెన్యూ శాఖ సదరు కన్స్ట్రక్షన్ కంపెనీకి నోటీసులు పంపింది. దీంతో ఇందులో పెట్టుబడి పెట్టిన రమ్యకృష్ణ, నయనతార, అంజలి టెండూల్కర్ తదితరులు తమ డబ్బులను వదులుకోవల్సిందేనా..? లేక వారి డబ్బులు వెనక్కి వస్తాయా..? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Read This Story Also: కరోనా వలన రైల్వే శాఖ ఎంత నష్టపోయిందంటే!