బ్రేకింగ్.. నక్సలైట్లకు భారీ షాక్.. ఆ కీలక నేత హతం..!
దేశ వ్యాప్తంగా ఓ వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సంగతి తెసలిందే. అయినప్పటికీ దండకారణ్యంలో నిత్యం తుపాకుల మోత మోగుతోంది. తాజాగా మంగళవారం కూడా పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భీకర పోరు జరిగింది. ఈ ఘటనలో మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ ఒకరు హతమయ్యారు. వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్గడ్లోని బీజాపూర్ జిల్లాలోని హర్రెపల్ అండ్ బీచ్పల్ అటవీ ప్రాంతంలో ఈ ఉదయం ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. దంతెవాడ, బీజాపూర్కు చెందిన డీఆర్ఈ, స్పెషల్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది కూంబింగ్ చేపడుతున్నారు. […]
దేశ వ్యాప్తంగా ఓ వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సంగతి తెసలిందే. అయినప్పటికీ దండకారణ్యంలో నిత్యం తుపాకుల మోత మోగుతోంది. తాజాగా మంగళవారం కూడా పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భీకర పోరు జరిగింది. ఈ ఘటనలో మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ ఒకరు హతమయ్యారు. వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్గడ్లోని బీజాపూర్ జిల్లాలోని హర్రెపల్ అండ్ బీచ్పల్ అటవీ ప్రాంతంలో ఈ ఉదయం ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. దంతెవాడ, బీజాపూర్కు చెందిన డీఆర్ఈ, స్పెషల్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది కూంబింగ్ చేపడుతున్నారు. ఈ క్రమంలో వీరిని గమినించిన మావోయిస్టులు కాల్పులకు దిగారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు.. ఎదురుకాల్పులకు దిగాయి. ఈ ఘటనలో ఓ మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఎదురుకాల్పుల్లో చనిపోయిన నక్సలైట్ను దర్సు పూనెంగా గుర్తించారు. ఇతనిపై ఎనిమిది లక్షల రివార్డు ఉన్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు.