సాహో దెబ్బకు నాచురల్ స్టార్ విలవిల..
ప్రభాస్ వేసిన గూగ్లీకి నాని ఔట్ అయ్యాడు. గ్యాంగ్ లీడర్ హీరోకి అనుకోకుండా ఝలక్ తగిలింది. నాని ఇప్పుడు ప్రభాస్ మీద కస్సుబుస్సులాడే సీన్ ఉంది. యంగ్ రెబల్స్టార్ ప్రభాస్ సాహో మూవీ రిలీజ్ వాయిదా పడటంతో ఈ తంటా వచ్చిపడింది. ఆగస్టు 15న విడుదల కావాల్సిన సాహో చెప్పిన డేట్కి విడుదల చేయలేమంటూ చేతులెత్తేశారు. అప్పటికల్లా మూవీకి సంబంధించి పెండింగ్లో ఉన్న గ్రాఫిక్ వర్క్ పూర్తి చేయలేమని టెక్నీషియన్లు హాండ్సప్ చెప్పేశారట. దీంతో ఈ మూవీ […]
ప్రభాస్ వేసిన గూగ్లీకి నాని ఔట్ అయ్యాడు. గ్యాంగ్ లీడర్ హీరోకి అనుకోకుండా ఝలక్ తగిలింది. నాని ఇప్పుడు ప్రభాస్ మీద కస్సుబుస్సులాడే సీన్ ఉంది. యంగ్ రెబల్స్టార్ ప్రభాస్ సాహో మూవీ రిలీజ్ వాయిదా పడటంతో ఈ తంటా వచ్చిపడింది. ఆగస్టు 15న విడుదల కావాల్సిన సాహో చెప్పిన డేట్కి విడుదల చేయలేమంటూ చేతులెత్తేశారు. అప్పటికల్లా మూవీకి సంబంధించి పెండింగ్లో ఉన్న గ్రాఫిక్ వర్క్ పూర్తి చేయలేమని టెక్నీషియన్లు హాండ్సప్ చెప్పేశారట. దీంతో ఈ మూవీ రిలీజ్ డేట్ను వాయిదా వేశారు. అయితే ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నదాన్ని బట్టి సాహో ఆగస్టు 30న విడుదలయ్యే ఛాన్సెస్ ఉన్నాయట. అందుకే నానీ తెగ వర్రీ అయిపోతున్నాడట.
విక్రమ్కుమార్ డైరెక్షన్లో నానీ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ గ్యాంగ్ లీడర్. నిన్న మొన్నటి వరకు ఈ మూవీ గురించి పెద్దగా ఎక్కడా చర్చ జరగలేదు. అయితే సాహో రిలిజ్ డేట్ పోస్ట్పోన్ అయ్యిందని తెలియగానే తన సినిమాకు ప్రొమోషన్ వర్క్స్ హడావిడిగా మొదలు పెట్టేశాడు. సరిగ్గా ఆగస్టు 30 తేదీనే తన సినిమా థియేటర్లకు వస్తుందని చెబుతూ ఫస్ట్లుక్ కూడా రిలీజ్ చేసేశాడు. అయితే ఒకవేళ నిజంగా సాహో ఆగస్టు 30న విడుదలకు రెడీ అయితే మాత్రం ఖచ్చితంగా నానీ తన మూవీని వాయిదా వేసుకోవడం తప్పనిసరి. మరోవైపు ఇదే కోవలో తమిళ హీరో సూర్యతో సహా పలు చిత్రాలకు కూడా డేట్స్ మార్చుకోవాల్సి రావచ్చంటున్నారు సినీ వర్గాలు.
ఇదిలా ఉంటే ప్రభాస్ మూవీతో నానీ అష్టకష్టాలు పడుతుంటే..అడవి శేష్, శర్వానంద్లు మాత్రం తెగ హ్యాపీగా ఉన్నారట. ఎందుకంటే సాహో ముందు చెప్పిన డేట్ ఆగస్టు 15న వీరిద్దరి సినిమాలు రిలీజ్ కానున్నాయి. అడవి శేష్ నటించిన “ఎవరు”, శర్వానంద్ “రణరంగం” చిత్రాలు రిలీజ్కు రెడీగా ఉన్నాయట. మొత్తానికి నానీకి వచ్చిన కష్టం మరో ఇద్దరికి సంతోషాన్ని కలిగిస్తుందన్నమాట.