Viral News: భర్త కిడ్నీ అమ్మి.. వచ్చిన డబ్బుతో.. లవర్తో జంప్ అయిన భార్య
పశ్చిమ బెంగాల్లో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. భర్త కిడ్నీ అమ్మించి, ఆ డబ్బు తీసుకొని ప్రియుడితో పరారయ్యింది ఓ మహిళ. భార్య మోసాన్ని గ్రహించిన సదరు భర్త చేసేది లేక పోలీసులను ఆశ్రయించాడు. ఈ వార్త విన్న నెటిజన్స్ అయ్య బాబోయ్ అంటూ భయపడిపోతున్నారు. పూర్తి డీటేల్స్ తెలుసుకుందాం పదండి..

రాను రాను సమాజంలో మోసాలు ఎక్కువైపోతున్నాయి. భార్య, భర్త, తల్లి, తండ్రి అనే బంధాలు కూడా చూడటం లేదు. డబ్బు కోసం కొందరు తల్లిదండ్రలు ప్రాణాలు తీసేస్తున్నారు. అక్రమ సంబంధాల మోజులో కొందరు కన్న బిడ్డలను చిత్ర హింసలకు గురిచేస్తున్న ఘటనలూ ఉన్నాయి. తాజాగా ఈ మహిళ భర్తకు మాయమాటలు చెప్పి, అతని కిడ్నీని అమ్మించి ఆ డబ్బుతో పిల్లలను, భర్తను వదిలేసి, ఫేస్బుక్లో పరిచయమైన ప్రియుడితో వెళ్లిపోయింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం…పశ్చిమబెంగాల్లోని హవ్డా జిల్లాకు చెందిన మహిళ తమ కుమార్తెను బాగా చదివించి, వివాహం చేయాలంటే చాలా డబ్బు కావాలని, అందుకు తన భర్తను కిడ్నీ అమ్మాల్సిందిగా సూచించింది. కిడ్నీ అమ్మితే పెద్దమొత్తంలో డబ్బు వస్తుందని దాంతో మన ఆర్ధిక సమస్యలన్న్ఈ తీరిపోతాయని నమ్మించింది.
భార్య పట్టుబట్టడంతో చేసేది లేక సదరు భర్త తన కిడ్నీని రూ.10 లక్షల రూపాయలకు అమ్మాడు. ఆ డబ్బుతో తన కుటుంబ సమస్యలు తీరిపోతాయని, అందరూ సంతోషంగా ఉండొచ్చని భావించాడు. డబ్బు తీసుకొచ్చి భార్యకు ఇచ్చాడు. ఇంకేముంది ఆ డబ్బు తీసుకొని భర్తను, కుమార్తను మోసం చేసి ఫేస్బుక్లో పరిచయమైన రవిదాస్ అనే వ్యక్తితో మహిళ పరారయ్యింది. విషయం తెలుసుకొని లబోదిబోమన్న భర్త పోలీసులను ఆశ్రయించాడు. పోలీసుల సహాయంతో మహిళ, అతని ప్రియుడు ఉన్న ప్రాంతానికి వెళ్లారు. అయితే ఆ మహిళ తన భర్తతో మాట్లాడేందుకు కూడా ఒప్పుకోకపోగా, అతనికి విడాకులు ఇస్తానని బెదిరించింది. చేసేది లేక, తన భార్య మాటలు నమ్మి మోసపోయానని, తనకు, తన పిల్లలకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకున్నాడు సదరు భర్త.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..