మంత్రాల నెపంతో మహిళను వివస్త్రను చేసి ఊరేగింపు..
మంత్రగత్తె ఆరోపణలతో ఓ మహిళకు గుండు గీయించి వివస్ర్తను చేసి నగ్నంగా ఊరేగించారు. ఈ అమానుష సంఘటన జార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది.
మనిషి అన్నిరంగాల్లో దూసుకుపోతున్నాడు. అంతరిక్షలో విహరించేందుకు అడుగువేస్తున్నాడు. కానీ, మరోవైపు మూఢనమ్మకాలతో అమాయకులను హింసిస్తూ పాతాళానికి చూస్తున్నారు. ఇలాంటి ఘటన ఒకటి తాజాగా చోటుచేసుకుంది. మంత్రగత్తె ఆరోపణలతో ఓ మహిళకు గుండు గీయించి వివస్ర్తను చేసి నగ్నంగా ఊరేగించారు. ఈ అమానుష సంఘటన జార్ఖండ్ రాష్ర్టం సిమ్దేగా జిల్లాలోని కొంబకెరా గ్రామంలో చోటుచేసుకుంది. మహిళను ఊరంతా తిప్పిన అనంతరం రూ.500 జరిమానా సైతం విధించారు. కాగా, బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దురాగాతానికి పాల్పడ్డ ఆరుగురు మహిళలతో సహా మొత్తం తొమ్మిది మందిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. గ్రామంలో ఇటీవల ఓ వ్యక్తి అనారోగ్యంతో మరణించాడు. దీంతో అతని చనిపోవడానికి ఆ మహిళ మంత్రాల వల్లే అని గ్రామస్తులు తీర్మానించారు. సదరు మహిళను పంచాయతీకి పిలిపించి.. మహిళకు గుండు గీయించి నగ్నంగా గ్రామంలో ఊరేగించాలని . పంచాయతీ సభ్యులు తీర్మానించారు. దీంతో మహిళను అమానించినట్లు గ్రామస్తులు తెలిపారు. మహిళపట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారిని కఠినంగా శిక్షించాలని రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.