‘ఆయనకు లంచ్ కూడా పంపిస్తాం’.. అరవింద్ కేజ్రీవాల్ పై పంజాబ్ సీఎం అమరేందర్ సింగ్ కౌంటర్
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేందర్ సింగ్ మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది. చండీ గడ్ లో రేపు తాను ప్రెస్ మీట్ పెడతానని కేజ్రీవాల్ ప్రకటించగా ..ఇందుకు పంజాబ్ ప్రభుత్వం మొదట అనుమతిని నిరాకరించింది.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేందర్ సింగ్ మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది. చండీ గడ్ లో రేపు తాను ప్రెస్ మీట్ పెడతానని కేజ్రీవాల్ ప్రకటించగా ..ఇందుకు పంజాబ్ ప్రభుత్వం మొదట అనుమతిని నిరాకరించింది. కానీ తాము ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి తీరుతామని ఆప్ నేతలు గట్టి పట్టు పట్టారు. కొద్దిసేపటికే దీనిపై అమరేందర్ సింగ్ వ్యంగ్యంగా స్పందిస్తూ..కేజ్రీవాల్ కోరితే తాను సంతోషంగా లంచ్ కూడా పంపిస్తానని అన్నారు. అసలు ఇదంతా డ్రామా అని వ్యాఖ్యానించారు. వాళ్ళు అబదలాడతారని అందరికీ తెలిసిందేనన్నారు. తమ రాష్ట్రంలో ర్యాలీ నిర్వహించడానికి లోగడ వారికి అనుమతినిచ్చామని…ఇప్పుడు ప్రెస్ మీట్ పెడతామంటే ఇందుకు అవసరమైన లంచ్ కూడా ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఏమైనా వీరిది ఓ నాటకం అని ఆరోపించారు. వచ్చే సంవత్సరం ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ సీఎం లిద్దరూ ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. తమ రాష్ట్రానికి కేజ్రీవాల్ రాకను అమరేందర్ సింగ్ చీప్ థియేట్రిక్స్ గా విమర్శించారు.
రైతుల ఆందోళనపై కూడా వీరిద్దరూ పరస్పరం విమర్శలు చేసుకున్నారు. కాగా-2017 లో జరిగిన ఎన్నికల్లో నాడు భగవంత్ మాన్ నేతృత్వంలోని ఆప్..117 సీట్లకు గాను 20 సీట్లను గెలుచుకుని ప్రధాన ప్రతిపక్షమైంది. అకాలీదళ్-బీజేపీ కూటమి 15 సీట్లు గెలుచుకోగా కాంగ్రెస్ పార్టీ 77 స్థానాలలో విజయం సాధించింది. అయితే ఇప్పటి పరిస్థితి వేరు.. సీఎం అమరేందర్ సింగ్ రాష్ట్రంలో తీవ్ర స్థాయిన అసమ్మతిని ఎదుర్కొంటున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: కాశ్మీర్ లో తొలి డ్రోన్ దాడి…ముష్కరులు టార్గెట్ ఏంటో తెలుసా.. వైరల్ అవుతున్న వీడియో..:Drone Attack video
బామ్మ రాక్స్.. మనమడు షాక్..బామ్మ ,మనమడు ఫన్నీ వైరల్ వీడియో.. మరీ ఇంత చీటింగ్ నా:viral video.