Viral Video: ముంబైలో భీతావహ దృశ్యం.. పేకమేడలా కుప్పకూలిన 4 అంతస్థుల భవనం..
Mumbai: మహారాష్ట్రలోని ముంబైలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగా సెకన్ల వ్యవధిలోనే నాలుగు అంతస్థుల భవనం పేకమేడలా కుప్పకూలింది.
Mumbai: మహారాష్ట్రలోని ముంబైలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగా సెకన్ల వ్యవధిలోనే నాలుగు అంతస్థుల భవనం పేకమేడలా కుప్పకూలింది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకన్స్లో బిల్డింగ్ నేలమట్టమైంది. ఇక్కడ అదృష్టం ఏంటంటే.. ఈ భీకర ప్రమాదంలో ఎవరూ చనిపోలేదు. కనీసం గాయపడనూ లేదు. ఈ భయానక ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ముంబై నగరంలోని బోరివారి పశ్చిమ ప్రాంతంలోని సాయిబాబా నగర్లో నాలుగు అంతస్థుల పాడుబడిన భవనం ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తిగా శిథిలావస్థకు చేరింది. దాంతో అందులోని వారంతా ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఈ పాడుబడ్డ భవంతిని కూల్చివేయాలని అధికారులు ఇప్పటికే నిర్ణయించగా.. తాజాగా ఆ భవనం దానంతట అదే కుప్పకూలింది. భవనం కూలిన విషయం తెలుసుకున్న ఫైర్ బ్రిగెడ్ సిబ్బంది.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. శిథిలాల కింద ఏ ఒక్కరూ చిక్కుకోలేదని తేల్చారు. దాంతో ఊపిరి పీల్చుకున్నారు స్థానికులు. ఎలాంటి ప్రాణనష్టం గానీ, ఎవరికీ గాయాలు కానీ కాలేదని ముంబై మున్సిపల్ అధికారులు ప్రకటించారు. భవనం శిథిలావస్థకు చేరిన కారణంగానే అది కుప్పకూలిందని చెప్పారు అధికారులు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..