Crime: మరీ ఇలా ఉన్నారేంట్రా బాబూ.. ఆ ఒక్క మాట అనడంతో ప్రియుడి గొంతు కోసిన వివాహిత..!
Crime: ఆమెకు పెళ్లైంది. కానీ భర్తకు దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో ఓ యువకుడితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది.
Crime: ఆమెకు పెళ్లైంది. కానీ భర్తకు దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో ఓ యువకుడితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. తనను పెళ్లి చేసుకోవాలని లవర్ను ఆమె కోరింది. కానీ అతని కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. లవర్ కూడా పెళ్లికి నిరాకరించాడు. దీంతో అతన్ని బ్లేడ్తో గొంతు కోసి అత్యంత దారుణంగా చంపింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్లోని టీలా మోద్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
నాలుగేళ్ల క్రితం వివాహమైన ప్రీతి శర్మ.. భర్తకు దూరంగా ఉంటోంది. ఈక్రమంలోనే పరిచయమైన ఫిరోజ్ అనే యువకుడితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. ఈ క్రమంలోనే తనను పెళ్లి చేసుకోవాలని ప్రీతి శర్మ.. ఫిరోజ్పై తీవ్రంగా ఒత్తిడి తీసుకువచ్చింది. అందుకు నిరాకరించి.. అసభ్యపదజాలంతో దూషించాడు. దీంతో ప్రియుడి గొంతును బ్లేడ్తో కోసి చంపింది. అనంతరం ట్రాలీ బ్యాగ్తో శవాన్ని మాయం చేసేందుకు ఫ్లాన్ చేసింది. ఇక ఆ డెడ్ బాడీని బయట డంప్ చేసేందుకు వెళ్తుండగా.. పోలీసుల తనిఖీల్లో ప్రీతి శర్మ పట్టుబడింది. ఫిరోజ్ను తానే చంపానని శర్మ అంగీకరించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..