Crime: దుర్మార్గానికి పరాకాష్ట.. బాలికపై మామ, తాత అఘాయిత్యం.. తండ్రికి చెప్పుకుంటే.. ఆఖరికి అతను కూడా..
2016, 2018 సంవత్సరాల్లో తాను ఉత్తరప్రదేశ్ లో ఉన్న సమయంలో.. తన అంకుల్ పలుమార్లు అత్యాచారం చేయగా.. తాతయ్య కూడా వేధింపులకు గురిచేసేవాడని బాలిక కళాశాల సిబ్బందికి తెలిపింది.
నిర్భయ లాంటి కఠిన చట్టాలున్నప్పటికీ.. కామాంధులు రెచ్చిపోతున్నారు. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా.. ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి, మామ ముక్కుపచ్చలారని బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వావి వరుసలు మరిచి మృగాల్లా ప్రవర్తించారు. పలు సందర్భాల్లో తండ్రితోపాటు ఆమె మామ అత్యాచారానికి పాల్పడ్డ ఘటన మహారాష్ట్రలోని పూణేలో చోటుచేసుకుంది. ఉత్తర్ప్రదేశ్ నుంచి వచ్చి ప్రస్తుతం పుణెలో నివాసం ఉంటోన్న 17 ఏళ్ల బాలిక.. ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు చెప్పడంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు. పూణే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూపీ నుంచి వచ్చి పుణెలో నివాసముంటున్న బాలిక.. ప్రస్తుతం చదువుతున్న కళాశాలలో లైంగిక వేధింపులపై కమిటీ సభ్యుల ముందు.. తన ఆవేదన వెళ్లబోసుకుంది. తన గోడును వారికి వినిపించడంతో అంతకుముందు తన జీవితంలో జరిగిన భయంకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పుణె పోలీస్ స్టేషన్లో బుధవారం నిందితులపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అలాగే, ఆమె తండ్రిని అరెస్టు చేసి విచారిస్తున్నట్లు వెల్లడించారు.
2016, 2018 సంవత్సరాల్లో తాను ఉత్తరప్రదేశ్ లో ఉన్న సమయంలో.. తన అంకుల్ పలుమార్లు అత్యాచారం చేయగా.. తాతయ్య కూడా వేధింపులకు గురిచేసేవాడని బాలిక కళాశాల సిబ్బందికి తెలిపింది. 2018లో పుణే వచ్చిన తర్వాత ఈ లైంగిక దాడి ఘటనల గురించి తన తండ్రికి ఓ చీటీలో రాసి ఇచ్చానని.. తెలిపింది. ఈ క్రమంలో తనను హింసించే వారిపై చర్యలు తీసుకోవడానికి బదులుగా.. తల్లి ఇంట్లోలేని సమయంలో తనపై పలు సందర్భాల్లో అత్యాచారానికి పాల్పడ్డాడని వివరించి చెప్పింది. దీంతో కళాశాల యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది.
బాలిక తన ఫిర్యాదులో పేర్కొన్న విధంగా పోలీసులు బాలిక తండ్రితో పాటు ఆమె అంకుల్, తాతయ్యలపైనా కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పూణే పోలీసులు వెల్లడించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..