UP Murder Case: శ్రద్ధా హత్య తరహాలో మరో ఘటన.. మాజీ ప్రేయసిని హత్య చేసి శరీరాల్ని ముక్కలుగా కోసి బావిలో పడేసిన ప్రియుడు..

తన దగ్గరకు వచ్చిన ఆరాధనని నవంబర్ 9న బైక్‌పై ఆలయానికి తీసుకెళ్లాడు. అప్పటికే ప్రిన్స్  బంధువు సర్వేష్ సహా మరికొందరు వేచి ఉన్నారు. ఇద్దరు కలిసి ఆరాధనను సమీపంలోని చెరకు తోటలోకి తీసుకెళ్లి గొంతుకోసి హత్య చేశారు.

UP Murder Case: శ్రద్ధా హత్య తరహాలో మరో ఘటన.. మాజీ ప్రేయసిని హత్య చేసి శరీరాల్ని ముక్కలుగా కోసి బావిలో పడేసిన ప్రియుడు..
Up Man Kills Ex Girlfriend
Follow us

|

Updated on: Nov 21, 2022 | 9:36 AM

ఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాకర్ హత్య ఉదంతాన్ని మరచిపోకముందే.. మళ్ళీ ఇప్పుడు మరొక దారుణ హత్య వెలుగులోకి వచ్చింది.  లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్న  శ్రద్ధాను బాయ్‌ఫ్రెండ్ ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా హత్య చేసి ముక్కలుగా నరికినట్లే.. మరొక యువకుడు తన మాజీ ప్రియురాలని చంపి.. ముక్కలు చేసి ఓ బావిలో పడేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. శ్రద్దా వాకర్‌ను చంపి 35 ముక్కలుగా నరికినట్లే, ఉత్తరప్రదేశ్ కి చెందిన ప్రిన్స్  యాదవ్ అనే యువకుడు తన మాజీ ప్రేయసిని హత్య చేసి.. అనంతరం ఆమె శరీరాన్ని  6 ముక్కలుగా కట్ చేసి బావిలో పడేశాడు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. నిందితుడిని ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్‌లో ఆదివారం అరెస్టు చేశారు. ఛిద్రమైన యువతి మృతదేహాన్ని బావి నుంచి వెలికితీశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవంబరు 15న అజంగఢ్‌లోని పశ్చిమ గ్రామంలోని బావిలో ఓ యువతి మృతదేహం నీటిపైకి తేలింది. కుళ్ళిన మృతదేశాన్ని చూసిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆ యువతి అర్ధనగ్న శవంతో పాటు.. ఆరు ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. విచారణ చేపట్టారు. బావిలో సమీపంలో యువతి తల దొరికింది.

మృతురాలి పేరు ఆరాధనగా గుర్తించామని అజంగఢ్ పోలీస్ సూపరింటెండెంట్ అనురాగ్ ఆర్య తెలిపారు. మృతదేహం నీటిలో రెండు మూడు రోజుల ఉండడంతో అప్పటికే కుళ్లిపోయి ఉందని పేర్కొన్నారు. పోలీసులు ప్రిన్స్  యాదవ్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.  విచారణ సమయంలో నిందితుడు తన కుటుంబ సభ్యుల సహాయంతో ఆరాధనని హత్య చేసినట్లు అంగీకరించినట్లు తెలుస్తోంది. అంతేకాదు తన నుంచి విడిపోయి వేరే వ్యక్తిని వివాహం చేసుకున్నందుకు ఆరాధనని చంపినట్లు ప్రిన్స్  యాదవ్ చెప్పినట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

నిందితుడు ప్రిన్స్ యాదవ్‌ను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. అయితే నిందితుడు నాటు తుపాకీ తీసుకుని పోలీసులపై కాల్పులు జరిపి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో పోలీసులు నిందితుడు పై పోలీసులు కాల్పులు జరిపారు. చికిత్స అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. ఆరాధన తాను ప్రేమించుకున్నామని.. అయితే ఈ ఏడాది మొదట్లో తనను నుంచి విడిపోయి ఆరాధన వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందని పోలీసులకు చెప్పాడు. దీంతో ఆరాధనపై కోపం పెంచుకున్న ప్రిన్స్ ఇప్పుడు పక్కా ప్లాన్ వేసి మరీ ఆరాధనతో మళ్లీ టచ్‌లోకి వెళ్ళాడు.

తన దగ్గరకు వచ్చిన ఆరాధనని నవంబర్ 9న బైక్‌పై ఆలయానికి తీసుకెళ్లాడు. అప్పటికే ప్రిన్స్  బంధువు సర్వేష్ సహా మరికొందరు వేచి ఉన్నారు. ఇద్దరు కలిసి ఆరాధనను సమీపంలోని చెరకు తోటలోకి తీసుకెళ్లి గొంతుకోసి హత్య చేశారు. ఆ తర్వాత ఇద్దరు వ్యక్తులు మరికొందరి సహాయంతో ఆ యువతి మృతదేహాన్ని 6 ముక్కలుగా నరికి ..  మృతదేహాన్ని నల్లటి పాలిథిన్ సంచిలో చుట్టి..  పడమటి గ్రామంలోని బావిలో పడేసినట్లు పోలీసులకు చెప్పాడు. అంతేకాదు కత్తిరించిన తలను సమీపంలోని చెరువులోకి విసిరేసినట్లు అంగీకరించాడు ప్రిన్స్.

నిందితుడి నుంచి నాటు పిస్టల్, కాట్రిడ్జ్‌లు, పదునైన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు ప్రిన్స్‌ను అరెస్టు చేయగా, సర్వేష్, ప్రమీలా యాదవ్, సుమన్, రాజారాం, కళావతి, మంజు, షీలా యాదవ్ పరారీలో ఉన్నారు. వారి ఆచూకీ కోసం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..