అత్తమామల ఆరోగ్యం ఎలా ఉందో ? నటి ఊర్మిళ ఆందోళన
కశ్మీర్లో నెలకొన్న తాజా పరిస్థితులపై కాంగ్రెస్ నేత , బాలీవుడ్ నటి ఊర్మిళా మతోండ్కర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టికల్ 370 రద్దుతో జమ్ము కశ్మీర్లో సాధారణ పరిస్థితులు లేవని, అక్కడి జనజీవనం అస్తవ్యస్తంగా మారిందంటూ అసహనం వ్యక్తం చేశారు. జమ్ము కశ్మీర్లో ఉన్న తన అత్తమామలతో మాట్లాడి 22 రోజులైందని ఇప్పటివరకు వారు ఎలా ఉన్నారో కూడా సమాచారం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. తన అత్తమామలు వృద్ధులని, వారు డయాబెటీస్, బీపీ సమస్యలతో […]
కశ్మీర్లో నెలకొన్న తాజా పరిస్థితులపై కాంగ్రెస్ నేత , బాలీవుడ్ నటి ఊర్మిళా మతోండ్కర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టికల్ 370 రద్దుతో జమ్ము కశ్మీర్లో సాధారణ పరిస్థితులు లేవని, అక్కడి జనజీవనం అస్తవ్యస్తంగా మారిందంటూ అసహనం వ్యక్తం చేశారు.
జమ్ము కశ్మీర్లో ఉన్న తన అత్తమామలతో మాట్లాడి 22 రోజులైందని ఇప్పటివరకు వారు ఎలా ఉన్నారో కూడా సమాచారం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. తన అత్తమామలు వృద్ధులని, వారు డయాబెటీస్, బీపీ సమస్యలతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. వారు సమయానికి మందులు వేసుకుంటున్నారో లేదో కూడా తెలియదన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల ఇప్పటి వరకు వారితో మాట్లాడే పరిస్థితి లేకుండా పోయిందని బాధను వ్యక్తం చేశారు. ఊర్మిళ మతోండ్కర్..
బాలీవుడ్తో పాటు తెలుగులో కూడా పలు సూపర్ హిట్ మూవీస్ నటించారు. ఆమె ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరి నార్త్ ముంబాయి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఊర్మిళ 2018లో చివరి సినిమా బ్లాక్ మెయిల్ మూవీతో నటనకు బ్రేక్ ఇచ్చారు.