Viral Video: జాతీయ గీతాన్ని మరిచి దిక్కులు చూసిన ఎంపీ.. సోషల్ మీడియాలో వైరల్గా మారిన వీడియో
భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కొందరు నేతలు కనీసం జాతీయ గీతం పాడలేక చతికిలబడుతున్నారు. పదాలు మరిచిపోయి దిక్కులు చూస్తున్నారు.
National Anthem: భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కొందరు నేతలు కనీసం జాతీయ గీతం పాడలేక చతికిలబడుతున్నారు. పదాలు మరిచిపోయి దిక్కులు చూస్తున్నారు. యూపీ లోని మొరాదాబాద్ కు చెందిన సమాజ్ వాదీ పార్టీ ఎంపీ హసన్ ఇలాంటి చిక్కుల్లోనే పడ్డారు. పంద్రాగస్టును పురస్కరించుకుని ఆదివారంనాడు తన నియోజకవర్గంలో నిన్న జాతీయ జెండాను ఎగుర వేసిన అనంతరం ఆయన జాతీయ గీతం ‘జన గణ మన’ పూర్తిగా పాడలేక చేతులెత్తేశారు. ఆయన సహచరులు కూడా జాతీయ గీతాన్ని పూర్తి చేయలేకపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో బీజేపీ నేత సాంబిత్ పాత్రా తన ట్విట్టర్లో షేర్ చేశారు.
ఎంపీ హసన్తో బాటు ఆయన పార్టీ నేతలు, మద్దతుదారులు కూడా ఈ గీతాన్ని పాడలేకపోయారని, మన నేతల పరిస్థితి ఇలా ఉందని పాత్రా ఎద్దేవా చేశారు. చివరకు ‘జయహే’ అంటూ ముగించారన్నారు. అయితే గత ఫిబ్రవరి 1 న బెంగాల్ లోని హౌరాలో జరిగిన బీజేపీ ర్యాలీలో ఈ పార్టీ నేత, మాజీ ఐపీఎస్ అధికారి భారతీ ఘోష్ కూడా జాతీయ గీతాన్ని సరిగా పాడలేక పోయారంటూ అప్పట్లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ విమర్శించారు. ఈ గీతంలో ఓ లైనును ఆయన విస్మరించారన్నారు. మరి బీజేపీ నేతలు మాత్రం తక్కువ తిన్నారా అంటూ సోషల్ మీడియా వేదికగా బీజేపీ నేతలపై సెటైర్లు పడిపోతున్నాయి.
#WATCH | Samajwadi Party MP ST Hasan, his supporters forgot the lyrics of the National Anthem during flag hoisting in Moradabad, on the occasion of Independence Day yesterday pic.twitter.com/UTLKEbwxdJ
— ANI UP (@ANINewsUP) August 16, 2021
మరిన్ని ఇక్కడ చూడండి: పరిస్థితి ఉద్రిక్తం.. కాబూల్ విమానాశ్రయంలో కాల్పులు.. అయిదుగురి మృతి ..?
ఆఫ్ఘన్ లోని భారతీయులకు షాకింగ్ న్యూస్.. కాబూల్ ఎయిర్ స్పేస్ మూసివేత