Up CM Yogi Adityanath : ఓట్ల లెక్కింపు..యూపీ స్థానిక ఎన్నికల్లో మాదే విజయం..బీజేపీ ..సమాజ్ వాదీ ఖండన
యూపీలో 476 బ్లాక్ పంచాయత్ చీఫ్ లకు శనివారం జరిగిన పోలింగ్ ముగిసింది. పలు చోట్ల రాళ్లు, కర్రలు, దాడులు, గన్స్, బాంబులతో బెదిరింపులు, హత్యా యత్నాలు, ఘర్షణల మధ్య ఈ ప్రక్రియ ముగిసింది. ఫలితాలు రాక ముందే బీజేపీ తనదేవిజయమని చెప్పుకోగా ఈ ఎన్నికల్లో ఆ పార్టీ భారీగా రిగ్గింగ్ కి
యూపీలో 476 బ్లాక్ పంచాయత్ చీఫ్ లకు శనివారం జరిగిన పోలింగ్ ముగిసింది. పలు చోట్ల రాళ్లు, కర్రలు, దాడులు, గన్స్, బాంబులతో బెదిరింపులు, హత్యా యత్నాలు, ఘర్షణల మధ్య ఈ ప్రక్రియ ముగిసింది. ఫలితాలు రాక ముందే బీజేపీ తనదేవిజయమని చెప్పుకోగా ఈ ఎన్నికల్లో ఆ పార్టీ భారీగా రిగ్గింగ్ కి పాల్పడిందని, అవకతవకలు జరిగాయని అఖిలేష్ యాదవ్ నేతృత్వం లోని సమాజ్ వాదీ పార్టీ ఆరోపించింది. ఈ ఎన్నికల్లో తమ పార్టీ 635 కి పైగా సీట్లను గెలుచుకుంటుందని సీఎం యోగి ఆదిత్యనాథ్ ధీమా వ్యక్తం చేశారు. ఫలితాలు ప్రకటించాక ఈ సీట్ల సంఖ్య ఇంకా పెరుగుతుందన్నారు. కాగా-హామిర్ పూర్ లో జరిగిన ఘ్జర్షణల్లో కొందరు గాయపడ్డారు. బీజేపీ కార్యకర్తలు తమ వర్గీయులపై కర్రలతో దాడి చేశారని, ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండా చేశారని సమాజ్ వాదీ పార్టీ ఆరోపించింది. ఈ అల్లర్లలో పోలీసులను కూడా వారు కొట్టారని కొందరు పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని ఈ పార్టీ పేర్కొంది.
అటు సుమారు 17 జిల్లాల్లో హింసాత్మక ఘటనలు జరిగాయి. అయోధ్య, హత్రాస్, ప్రతాప్ గఢ్, ప్రయాగ్ రాజ్ తదితర జిల్లాల్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలను సమాజ్ వాదీ నేతలు రిలీజ్ చేశారు. వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో మరెంత హింస జరుగుతుందోనని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసు బలగాలను ఎంతగా పెంచినా చివరకు స్థానిక ఎన్నికల్లో కూడా ఇలా హింస చెలరేగడం విశేషం.
మరిన్ని ఇక్కడ చూడండి : ప్రకాష్ రాజ్ ట్వీట్ కు నరేష్ దిమ్మ తిరిగే రిప్లై..!రసవత్తరంగా మారిన ‘మా’ అధ్యక్ష పోటీ..:Prakash Raj VS Naresh Video.