WhatsApp: ఇండియా మ్యాప్ ను తప్పుగా చూపిన వాట్సాప్.. కేంద్ర మంత్రి సీరియస్.. చివరకు..
వాట్సాప్.. ఈ పేరు తెలియని వారు ఇండియాలోనే లేరు. అంతగా అందరికీ ఫేవరెట్ గా మారిన వాట్సాప్.. ఓ చిన్న పొరపాటు కారణంగా కేంద్ర ప్రభుత్వ ఆగ్రహానికి గురైంది. తన ట్విట్టర్ ఖాతాలో భారత్ మ్యాప్ను...
వాట్సాప్.. ఈ పేరు తెలియని వారు ఇండియాలోనే లేరు. అంతగా అందరికీ ఫేవరెట్ గా మారిన వాట్సాప్.. ఓ చిన్న పొరపాటు కారణంగా కేంద్ర ప్రభుత్వ ఆగ్రహానికి గురైంది. తన ట్విట్టర్ ఖాతాలో భారత్ మ్యాప్ను తప్పుగా చూపించే గ్రాఫిక్ చిత్రాన్ని పోస్టు చేయడం వివాదంగా మారింది. పాక్ ఆక్రమిత కశ్మీర్, చైనా తమదేనని చెబుతున్న ప్రాంతాలు లేని భారత చిత్రపటాన్ని పోస్ట్ చేయడంతో వివాదం రాజుకుంది. దీనిపై కేంద్రం ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వాట్సాప్ కు వార్నింగ్ కూడా ఇవ్వడం గమనార్హం. జరిగిన తప్పును వెంటనే సరిదిద్దాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. భారత్లో వ్యాపారం చేస్తున్న అన్ని సంస్థలు, వ్యాపారం కొనసాగించాలనుకుంటున్న సంస్థలు తప్పనిసరిగా సరైన మ్యాప్ను వినియోగించాలని సూచించారు.
ఈ మేరకు ట్విట్టర్ లో రీ ట్వీట్ చేసిన కేంద్రమంత్రి.. వాట్సాప్ మాతృసంస్థ ‘మెటా’నూ ట్యాగ్ చేశారు. కొత్త ఏడాది ని పురస్కరించుకుని వాట్సాప్ ఈ గ్రాఫిక్ చిత్రాన్ని పోస్ట్ చేసింది. ఇది జరిగిన కొద్ది గంటల్లోనే తప్పును కేంద్రమంత్రి గుర్తించారు. వెంటనే మెటాకు ఫిర్యాదు చేశారు. అయితే.. భారత భూ భాగాలను తప్పుగా చూపించే చిత్రాలను పోస్ట్ చేయడం తీవ్ర పరిణామానికి కారణమవుతుంది. అలాంటి తప్పులు చేసే వారికి జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. కశ్మీర్ లేకుండా మ్యాప్లను చూపించండంపై గతంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు ఇతర సంస్థల తీరుపట్ల అసహనం వ్యక్తం చేసింది భారత్.
Dear @WhatsApp – Rqst that u pls fix the India map error asap.
All platforms that do business in India and/or want to continue to do business in India , must use correct maps. @GoI_MeitY @metaindia https://t.co/aGnblNDctK
— Rajeev Chandrasekhar ?? (@Rajeev_GoI) December 31, 2022
కాగా.. మ్యాప్ పై వివాదం రేగడంతో వాట్సాప్ స్పందించింది. మంత్రి వార్నంగ్ తో తప్పుగా ఉన్న ట్వీట్ను తొలగించింది. ట్విట్టర్ వేదికగా క్షమాపణలు తెలిపింది. అనుకోకుండా జరిగిన తప్పును గుర్తించామని, దానిని వెంటనే తొలగిస్తున్నామని వెల్లడించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం