Anurag Thakur: కేజ్రీవాల్ని లాలూతో పోల్చిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్.. ఇద్దరిదీ ఒక్కటే మోడల్ అంటూ..
కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్.. ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని AAP ప్రభుత్వం మద్యం, విద్య, డీటీసీ బస్సు స్కామ్లతో మునిగిపోయిందని ఆరోపించారు.
Anurag Thakur on Arvind Kejriwal: ఢిల్లీ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలు రేపు జరగనున్నాయి. ఎంసీడీని కైవసం చేసుకునేందుకు బీజేపీ, ఆప్ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఇప్పటికే ప్రచారాన్ని ముగించిన ప్రధాన పార్టీలు.. ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్.. ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని AAP ప్రభుత్వం మద్యం, విద్య, డీటీసీ బస్సు స్కామ్లతో మునిగిపోయిందని ఆరోపించారు. ఆప్ ప్రభుత్వం కార్మికుల హక్కులను హరిస్తూ స్కామ్ లు చేస్తుందన్నారు. అరవింద్ కేజ్రీవాల్ అవినీతికి సరికొత్త నమూనాను అందించారంటూ విమర్శించారు. లాలూ ప్రసాద్ యాదవ్ ‘దోపిడి’ నమూనాను ఢిల్లీలో కేజ్రీవాల్ అనుసరిస్తున్నారంటూ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మండిపడ్డారు.
కాగా, రేపు జరిగే మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఎన్నికల పోలింగ్కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. డిసెంబర్ 7న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎంసీడీ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ వ్యాప్తంగా 13,638 పోలింగ్ స్టేషన్లు, 68 మోడల్ పోలింగ్ కేంద్రాలు, 68 పింక్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. దీనిలో భాగంగా స్కూళ్లకు 5 వరకు సెలవులు ప్రకటించారు. మెట్రో సేవలు కూడా తెల్లవారుజామున 4 గంటలకే ప్రారంభంకానున్నాయి.
AAP govt involved in liquor, education, DTC bus scams, & even deprived labourers of their rights. Arvind Kejriwal has presented a new model of corruption; Lalu Prasad Yadav’s ‘loot’ model is being followed by Kejriwal in Delhi: Union Minister Anurag Thakur pic.twitter.com/MZK27Ahnhg
— ANI (@ANI) December 3, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం..