Amit Shah: నెల్లూరు జిల్లా పర్యటనలో అమిత్ షా.. స్వర్ణభారత్ ట్రస్ట్ 20వ వార్షికోత్సవానికి హాజరు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నెల్లూరు జిల్లా వెంకటాచలంలో ఆదివారం పర్యటించారు.
Amit Shah Nellore District Tour: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నెల్లూరు జిల్లా వెంకటాచలంలో ఆదివారం పర్యటించారు. ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడితో కలిసి అమిత్ షా.. సరస్వతీ నగర్లోని అక్షర విద్యాలయం సందర్శించారు. అక్షరలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను సందర్శించారు. అనంతరం వెంకటాచలంలో స్వర్ణభారత్ ట్రస్ట్ 20వ వార్షికోత్సవానికి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Andhra Pradesh: Union Home Minister Amit Shah arrives at Venkatachalam.
He will chair the 29th Southern Zonal Council meeting today in Tirupati today. pic.twitter.com/olnAxGut8g
— ANI (@ANI) November 14, 2021
అంతకుముందు తిరుపతిలో టెన్షన్..టెన్షన్ నెలకొంది. కేంద్రమంత్రి అమిత్ షా టూర్ను అడ్డుకుంటామన్న సీపీఐ ప్రకటనతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. తిరుపతిలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణను అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. తిరుపతిలో అమిత్షా అధ్యక్షతన మధ్యాహ్నం 3గంటలకు సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఐతే ఆ సమావేశం వద్ద నల్లజెండాలతో నిరసన తెలుపుతామని..అమిత్ షాను అడ్డుకుంటామని ప్రకటించారు సీపీఐ నారాయణ. దీంతో అప్రమత్తమైన పోలీసులు..తిరుపతి బైరాగిపట్టెడ వద్ద వాకింగ్ చేస్తున్న నారాయణను అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేంద్రమంత్రి అమిత్ షా గోబ్యాక్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నారు సీపీఐ నేతలు. నారాయణను అక్రమంగా అదుపులొకి తీసుకున్నారని,..వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.