వికాస్ దూబే అనుచరులు ఇద్దరు హతం
యూపీ హిస్టరీ షీటర్ వికాస్ దూబే అనుచరుల్లో ఇద్దరు హతమయ్యారు. రెండు వేర్వేరు ఎన్ కౌంటర్లలో వీరు మరణించారు. ఈ నెల 7 న హర్యానాలోని ఫరీదా బాద్ లో ప్రభాత్ మిశ్రా అనే ఇతని సహచరునితో బాటు మరొకరిని కాన్పూర్ కి తీసుకువస్తుండగా..
యూపీ హిస్టరీ షీటర్ వికాస్ దూబే అనుచరుల్లో ఇద్దరు హతమయ్యారు. రెండు వేర్వేరు ఎన్ కౌంటర్లలో వీరు మరణించారు. ఈ నెల 7 న హర్యానాలోని ఫరీదా బాద్ లో ప్రభాత్ మిశ్రా అనే ఇతని సహచరునితో బాటు మరొకరిని కాన్పూర్ కి తీసుకువస్తుండగా ప్రభాత్ పారిపోవడానికి యత్నించాడు. ఖాకీలు తమ వ్యాన్ టైర్ ని మార్చడానికి యత్నిస్తున్న సమయంలో ప్రభాత్ వారి నుంచి పిస్టల్ లాక్కుని కాల్పులు జరిపాడని, అయితే తప్పించుకున్న పోలీసులు తిరిగి అతనిపై కాల్పులు జరిపారని తెలిసింది. ఈ ఘటనలో అతని కాలికి గాయాలయ్యాయని, ఆసుపత్రికి తీసుకువెళ్లగా అక్కడ మృతి చెందాడని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. అటు-బౌవా దూబే అలియాస్ ప్రవీణ్ అనే వ్యక్తిని గురువారం ఉదయం కాల్చి చంపారు. ఇతనిపై 50 వేల రివార్డు ఉంది. లక్నోకి 220 కి.మీ. దూరంలోని ఎటావా లో జరిగిన ఎన్ కౌంటర్ లో యితడు హతమయ్యాడు. ఘటనా స్థలం నుంచి పిస్టల్, రైఫిల్, తూటాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.