ఫిబ్రవరిలో అగ్రరాజ్యాధినేత భారత్ రాక!

ఫిబ్రవరి నెలలో యావత్ ప్రపంచం భారత్ వైపు చూసే సందర్భం రానుందా? ఓ ఆంగ్ల ప్రతిక కథనం నిజమైతే డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి మూడో వారంలో ఇండియా పర్యటనకు రానున్నారు. గత సంవత్సరం రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవ్వాలని డొనాల్డ్ ట్రంప్‌ని స్వయంగా ప్రధాని మోదీ ఆహ్వానించినా.. ఆయన షెడ్యూల్ బిజీగా వుండడంతో మోదీ అభ్యర్థనను ట్రంప్ తిరస్కరించారు. రెండు, మూడు నెలల క్రితం ట్రంప్‌ని కలిసిన కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, జై […]

ఫిబ్రవరిలో అగ్రరాజ్యాధినేత భారత్ రాక!
Follow us

|

Updated on: Jan 14, 2020 | 1:44 PM

ఫిబ్రవరి నెలలో యావత్ ప్రపంచం భారత్ వైపు చూసే సందర్భం రానుందా? ఓ ఆంగ్ల ప్రతిక కథనం నిజమైతే డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి మూడో వారంలో ఇండియా పర్యటనకు రానున్నారు. గత సంవత్సరం రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవ్వాలని డొనాల్డ్ ట్రంప్‌ని స్వయంగా ప్రధాని మోదీ ఆహ్వానించినా.. ఆయన షెడ్యూల్ బిజీగా వుండడంతో మోదీ అభ్యర్థనను ట్రంప్ తిరస్కరించారు. రెండు, మూడు నెలల క్రితం ట్రంప్‌ని కలిసిన కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, జై శంకర్… మరోసారి ట్రంప్‌ను భారత పర్యటనకు ఆహ్వానించారు.

కేంద్ర మంత్రుల అభ్యర్థనకు ట్రంప్ సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది. అయితే, రిపబ్లిక్ డే వేడుకలకు ఆయన రావడం లేదని, ఫిబ్రవరి మూడో వారంలో ట్రంప్ ఇండియాకు రావచ్చని జాతీయ మీడియా పేర్కొంది. అయితే, ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు అభిశంసన తీర్మానాన్ని ఎదుర్కొంటున్నారు. దానికి సంబంధించి వచ్చే వారం సెనెట్‌లో ఓటింగ్ జరిగే పరిస్థితి వుంది. సెనెట్‌లో బలమున్న ట్రంప్‌కు అభిశంసన భయం లేకపోయినప్పటికీ ఆ తంతు ముగిసిన తర్వాత గానీ.. భారత్ పర్యటనకు తేదీలను ఖరారు చేయలేరు.

సో.. ట్రంప్ భారత్ పర్యటన తేదీలు జనవరి నాలుగో వారం కల్లా ఖరారవుతాయని తెలుస్తోంది. గత నవంబర్‌లోనే తాను ఏదో ఒక సందర్భంలో భారత్‌కు వెళతానని అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. ఆయన ప్రకటనకు అనుగుణంగానే ప్రస్తుతం వైట్ హౌజ్ వర్గాలు తేదీల ఖరారుపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. పశ్చిమాసియా దేశాల్లో మరీ ముఖ్యంగా ఇరాన్, ఇరాక్ దేశాలలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ పాత్ర అత్యంత కీలకమైన నేపథ్యంలో ట్రంప్ భారత్ పర్యటనపై ఆసక్తిగా వున్నారని ప్రచారం జరుగుతోంది.