మధ్యప్రదేశ్ లో కూలిపోయిన ట్రైనర్ విమానం..ట్రైనర్, ట్రెయినీ సురక్షితం..
మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లాలో శనివారం శిక్షణలో ఉన్న (ట్రైనర్) లో ఉన్న విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ట్రైనర్, ట్రెయినీ ఇద్దరూ గాయపడకుండా సురక్షితంగా బయటపడ్డారు. హైవేపై విమానం దిగుతుండగా పొలాల్లో కూలిపోయింది.
మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లాలో శనివారం శిక్షణలో ఉన్న (ట్రైనర్) లో ఉన్న విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ట్రైనర్, ట్రెయినీ ఇద్దరూ గాయపడకుండా సురక్షితంగా బయటపడ్డారు. హైవేపై విమానం దిగుతుండగా పొలాల్లో కూలిపోయింది. మధ్యప్రదేశ్..దానా లోని చైమ్స్ ఏవియేషన్ అకాడమీకి చెందినదిగా దీన్ని గుర్తించారు. విమానం క్రాష్ గురించి తెలియగానే పౌర విమాన యాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పందిస్తూ.. ఇప్పుడే తనకు సమాచారం అందిందని, అదృష్ట వశాత్తూ ఈ ప్రమాదంలో సిబ్బంది ఇద్దరూ సురక్షితంగా ఉన్నారని ట్వీట్ చేశారు. ఈ ప్రమాదానికి కారణం తెలుసుకునేందుకు వెంటనే దర్యాప్తు బృందాన్ని పంపిస్తున్నట్టు ఆయన తెలిపారు. గత 18 నెలల్లో ట్రైనర్ విమానం కూలిపోవడం ఇది రెండోసారి. 2020 జనవరిలో ఇలాంటి విమానం రన్ వే పై కూలిపోగా ఇద్దరు మరణించారు. 2009 లో ఓ ప్లేన్ నర్మదానదిపై బాగ్రీ డ్యామ్ మీద కూలిపోయింది.
కాగా- మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లాలో కూలిపోయిన విమానాన్నిచూసేందుకు పెద్ద సంఖ్యలో స్థానికులు అక్కడకి చేరుకున్నారు. బహుశా ఇంజన్ లోపం వల్లే ఇది కూలినట్టు భావిస్తున్నారు. దర్యాప్తు బృందం కొద్దిసేపటి క్రితం ఇక్కడికి చేరి తమ ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టింది. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది.
#WATCH | Madhya Pradesh: A Cessna aircraft strayed off the runway at around 3 pm at Chimes Aviation Academy situated in the Dhana area of Sagar pic.twitter.com/vAQcBZZkSs
— ANI (@ANI) July 17, 2021
మరిన్ని ఇక్కడ చూడండి : అంతరిక్షంలో ఆస్ట్రోనాట్స్ ఏమి తింటారు?వ్యోమగాముల రెగ్యులర్ లైఫ్ ఏంటి..:astronauts eat in space video.