జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్, ముగ్గురు ఉగ్రవాదుల కాల్చివేత
జమ్మూ కాశ్మీర్ లోని బారాముల్లా జిల్లా పట్టాన్ ప్రాంతంలో భద్రతా దళాలతో జరిగిన ఎన్ కౌంటర్ లో హిజ్ బుల్ ముజాహిదీన్ కి చెందిన ముగ్గురు టెర్రరిస్టులు మరణించారు, భారత జవాన్లకు, ఉగ్రవాదులకు మధ్య..
జమ్మూ కాశ్మీర్ లోని బారాముల్లా జిల్లా పట్టాన్ ప్రాంతంలో భద్రతా దళాలతో జరిగిన ఎన్ కౌంటర్ లో హిజ్ బుల్ ముజాహిదీన్ కి చెందిన ముగ్గురు టెర్రరిస్టులు మరణించారు, భారత జవాన్లకు, ఉగ్రవాదులకు మధ్య సుమారు 12 గంటలపాటు హోరాహోరీ కాల్పులు జరిగాయి. టెర్రరిస్టులు కొందరు పిల్లలతో సహా 12 మంది పౌరులను బందీలుగా పట్టుకున్నారని, అయితే అతి కష్టం మీద వారిని రక్షించగలిగామని సైనిక వర్గాలు తెలిపాయి. టెర్రరిస్టుల కాల్పుల్లో ఒక సైనికాధికారి సహా ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. కాగా… మరికొంతమంది ఉగ్రవాదులు పారిపోయినట్టు భావిస్తున్నామని, వారికోసం గాలింపు జరుగుతోందని సైనికాధికారులు తెలిపారు.