ఉగ్రవాదులకు నిధులు అందజేస్తున్న ముగ్గురు వ్యక్తులు అరెస్ట్
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఉగ్రవాదులకు ఆర్ధికంగా సహకారం చేస్తున్న వారిపై కూడా పోలీసులు, భద్రతా బలగాలు ఓ కన్నేశారు. ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్న..
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఉగ్రవాదులకు ఆర్ధికంగా సహకారం చేస్తున్న వారిపై కూడా పోలీసులు, భద్రతా బలగాలు ఓ కన్నేశారు. ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్న వారి కదలికలపై కన్నేసి.. బుధవారం ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. వీరు ఉత్తర కశ్మీర్లో ఉగ్రవాదులకు నిధులు చేరేవేస్తూ.. వారితో కలిసి ఉగ్ర కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు గుర్తించారు. వీరికి ఇంత పెద్ద ఎత్తున నగదు ఎక్కడి నుంచి వస్తుందన్న దానిపై దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి.. నిందితులు ముగ్గుర్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
Three terrorist associates arrested today, they were involved in terror-funding activities and working with different terrorist outfits in Northern districts of Kashmir. Rs 5 lakhs recovered from their possession: Jammu & Kashmir Police pic.twitter.com/fEsc0PBSL2
— ANI (@ANI) August 12, 2020
Read More :