యూపీలో గంజాయి పట్టివేత.. ముగ్గురు అరెస్ట్
యూపీలో పెద్ద ఎత్తున గంజాయి పట్టుబడింది. మనిపురి ప్రాంతంలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ చేపట్టిన తనిఖీల్లో 213 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను..
యూపీలో పెద్ద ఎత్తున గంజాయి పట్టుబడింది. మనిపురి ప్రాంతంలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ చేపట్టిన తనిఖీల్లో 213 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. పట్టుబడ్డ గంజాయి విలువ రూ.12 లక్షలకు పైగా ఉంటుందని పోలీసులు తెలిపారు. అరెస్ట్ అయిన వారిని నివాస్ విశ్వాస్, మహేంద్ర సింగ్, రాకేష్ గౌర్ గా గుర్తించారు. ఈ ముగ్గుర్ని ఆగస్టు 20వ తేదీ రాత్రి 9.30 గంటలకు అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఓ ట్రక్కుతో పాటు, కారు, మూడు సెల్ ఫోన్లను నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై సెక్షన్ 18,20,22 అండ్ 60 ఆఫ్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ ప్సైక్ట్రోపిక్ సబ్స్టాన్స్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Read More :
గుండెపోటుతో బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత