ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి ఇది కొత్త కాదు, గులాం నబీ ఆజాద్

హత్రాస్ ఘటనపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్.. యూపీకి ఈ విధమైన ఘటనలు కొత్త కాదని వ్యాఖ్యానించారు. ఆ రాష్ట్రానికి సంబంధించినంతవరకు..

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి ఇది కొత్త కాదు, గులాం నబీ ఆజాద్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 03, 2020 | 5:19 PM

హత్రాస్ ఘటనపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్.. యూపీకి ఈ విధమైన ఘటనలు కొత్త కాదని వ్యాఖ్యానించారు. ఆ రాష్ట్రానికి సంబంధించినంతవరకు ఇలాంటివి అక్కడ మామూలే ! అసలు అక్కడ ఓ సిస్టం అంటూ ఉందా ? అని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వఛ్చినప్పటి నుంచి ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయని, రెచ్చిపోయిన గుంపులు వ్యక్తులను రాళ్లతో కొట్టి చంపడం, విపక్ష నేతలను హతమార్చడం, వారిపై తప్పుడు కేసులు పెట్టడం జరుగుతోందని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా యూపీ ప్రభుత్వం కళ్ళు తెరచి ఈ దారుణాలను అరికట్టడానికి గట్టి చర్యలు తీసుకోవాలని గులాం నబీ ఆజాద్ కోరారు.