Crime: కదిలే రైలు నుంచి తోసేశారు.. ఆ విషయంలో తలెత్తిన గొడవ.. చివరికి
వాటర్ బాటిల్ విషయంలో చెలరేగిన గొడవ తీవ్ర పరిణామాలకు దారి తీసింది. రైల్వే ప్యాంట్రీ (Pantry Staff) అనాలోచిత చర్యకు ఓ వ్యక్తి ఆస్పత్రిపాలయ్యాడు. పాన్ మసాలా ఉమ్మేశాడంటూ మొదలైన గొడవ చినికి చినికి గాలివానలా మారి ప్రాణాల పైకే తీసుకొచ్చింది....
వాటర్ బాటిల్ విషయంలో చెలరేగిన గొడవ తీవ్ర పరిణామాలకు దారి తీసింది. రైల్వే ప్యాంట్రీ (Pantry Staff) అనాలోచిత చర్యకు ఓ వ్యక్తి ఆస్పత్రిపాలయ్యాడు. పాన్ మసాలా ఉమ్మేశాడంటూ మొదలైన గొడవ చినికి చినికి గాలివానలా మారి ప్రాణాల పైకే తీసుకొచ్చింది. కోపంలో రైల్వే సిబ్బంది సదరు వ్యక్తిని కదులుతున్న రైలు లో నుంచి తోసేశారు. ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న ఈ వీడియో ఉత్తరప్రదేశ్ లో జరిగింది. రవి యాదవ్.. అనే వ్యక్తి తన సోదరితో కలిసి రప్తిసాగర్ ఎక్స్ప్రెస్లో జర్నీ చేస్తున్నాడు. రైలు జిరోలి దగ్గరకు చేరుకోగానే అతనికి ప్యాంట్రీ స్టాఫ్తో గొడవ జరిగింది. వాటర్ బాటిల్ కొనుగోలుతో మొదలైన ఈ గొడవ తీవ్ర ఘర్షణకు దారి తీసింది. రైలులో పాన్ మసాలా ఉమ్మేశారనే కారణంతో గొడవ మరింత పెద్దదైంది. ఈ క్రమంలో రైలు రవియాదవ్ దిగాల్సిన చోటుకు అంటే లలిత్ పుర్ (Lalitpur) కు చేరుకుంది. అయితే లలిత్ పుర్ స్టేషన్ లో రవి యాదవ్ ను దించేసిన సిబ్బంది.. అతడు మాత్రం దిగకుండా ఈ తరుణంలో లలిత్పూర్ స్టేషన్ దగ్గర రవి యాదవ్ సోదరిని సిబ్బంది దించేశారు. అయితే అతన్ని మాత్రం దిగకుండా అడ్డుకున్నారు.
ఆ క్రమంలోనే రైలు కదిలింది. రవిని బలవంతంగా రైలు దిగనీయకుండా పట్టుకుని దాడి చేశారు. అనంతరం అతన్ని పట్టాలపై పడేశారు. గమనించిన స్థానికులు రవిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అతనిని పరీక్షించిన వైద్యులు.. రవి ప్రాణపాయ స్థితి నుంచి బయటపడ్డాడని, భయపడాల్సిందేమీ లేదని చెప్పడంతో అతని కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. రవి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న ఝాన్సీ పోలీసులు.. ప్యాంట్రీ సిబ్బందిపై కేసు నమోదు చేసుకుని ఒకరిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి