తండ్రి మరణించిన దుఃఖంతోనే, పరేడ్ లో పాల్గొన్న మహిళా పోలీసు అధికారి
తమిళనాడు లోని తిరునల్వేలి జిల్లాలో మహేశ్వరి అనే మహిళా పోలీసు అధికారి కథనం ప్రభుత్వాన్నే కదిలించింది. తన తండ్రి మృతి చెందినప్పటికీ ఆ దుఃఖాన్ని దిగమింగి..
తమిళనాడు లోని తిరునల్వేలి జిల్లాలో మహేశ్వరి అనే మహిళా పోలీసు అధికారి కథనం ప్రభుత్వాన్నే కదిలించింది. తన తండ్రి మృతి చెందినప్పటికీ ఆ దుఃఖాన్ని దిగమింగి ఆమె స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జరిగిన పరేడ్ లో పాల్గొంది. మహేశ్వరి తండ్రి 83 ఏళ్ళ నారాయణస్వామి ఈ నెల 14 న దిండిగల్ జిల్లాలో మరణించారు. ఆ రోజు రాత్రే ఈమెకు ఈ సమాచారం తెలిసింది. అయితే దిండిగల్ తిరునల్వేలికి సుమారు 200 కి.మీ. దూరంలో ఉంది. కానీ మరుసటిరోజే ఇండిపెండెన్స్ డే సందర్భంగా జరిగే పరేడ్ కి మహేశ్వరి నేతృత్వం వహించాల్సి ఉంది. తండ్రా లేక డ్యూటీయా అని తేల్చుకోలేక కొంతసేపు సతమతమైన ఈమె చివరికి డ్యూటీయే ఫస్ట్ అని నిర్ణయించుకుంది.
చిన్నప్పటి నుంచి గారాబంగా పెంచినప్పటికీ తన తండ్రి మరణాన్ని పక్కనబెట్టి విధి నిర్వహణకే ప్రాధాన్యమిచ్చిన మహేశ్వరిని డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం సహా అంతా అభినందించారు.