డ్రగ్స్ కేసు: కరణ్ జోహార్ ప్రధాన అనుచరుడు అరెస్ట్
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ కేసులో డ్రగ్స్ కోణంలో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అరెస్ట్ల పర్వం కొనసాగుతోంది.
NCB arrests Kshitij Prasad: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ కేసులో డ్రగ్స్ కోణంలో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అరెస్ట్ల పర్వం కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన ఎన్సీబీ తాజాగా ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్ ప్రధాన అనుచరుడు క్షితిజ్ ప్రసాద్ని అదుపులోకి తీసుకుంది. కాగా కరణ్ జోహార్కి చెందిన ధర్మ ప్రొడక్షన్లో క్షితిజ్ ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేస్తున్నారు. కరణ్కి ప్రధాన అనుచరుడిగా ఇతడికి పేరుంది. ఈ కేసులో క్షితిజ్ పేరును రకుల్ చెప్పినట్లు తెలుస్తుండగా.. అతడిని 20 గంటల పాటు విచారించిన ఎన్సీబీ అధికారులు పలు వివరాలను రాబట్టారు. ఈ క్రమంలో ఇవాళ క్షితిజ్ని అరెస్ట్ చేశారు. కాగా విచారణలో భాగంగా పలువురు బాలీవుడ్ సెలబ్రిటీల పేర్లను క్షితిజ్ బయటపెట్టినట్లు తెలుస్తోంది.
మరోవైపు ఈ కేసులో ఇవాళ ఎన్సీబీ ముందుకు నటి శ్రద్దాకపూర్ వెళ్లారు. చిచ్చోర్ మూవీ తరువాత పార్టీకి తాను హాజరయ్యానని, అప్పుడు ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని శ్రద్ధా చెప్పినట్లు సమాచారం. ఇక ఆ పార్టీలో ఎక్కువ మంది పాల్గొనలేదని చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే జయ సాహాతో చాట్ చేసిన విషయాన్ని ఆమె ధృవీకరించినట్లు టాక్. మరోవైపు ఈ కేసులో దీపికా పదుకొనే కూడా ఇవాళ విచారణకు హాజరయ్యారు. వాట్సాప్లో డ్రగ్స్ గ్రూపుకు దీపికానే అడ్మిన్ అని తెలుస్తుండగా.. ఆ కోణంలో ఎన్సీబీ అధికారులు ఆమెను విచారిస్తున్నట్లు సమాచారం.
Read More: