మద్యం దుకాణాలపై పిటిషన్.. న్యాయవాదికి రూ. లక్ష జరిమానా
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ న్యాయవాదికి రూ.లక్ష జరిమానా విధించింది. లాక్డౌన్ వేళ మద్యం దుకాణాలు తెరవడాన్ని సవాల్ చేస్తూ ఓ న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ న్యాయవాదికి రూ.లక్ష జరిమానా విధించింది. లాక్డౌన్ వేళ మద్యం దుకాణాలు తెరవడాన్ని సవాల్ చేస్తూ ఓ న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ను విచారించేందుకు కోర్టు నిరాకరించింది. పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాదికి రూ. లక్ష జరిమానా విధించింది సుప్రీంకోర్టు. మద్యం దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించడం లేదని, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని పిటిషన్లో న్యాయవాది పేర్కొన్నాడు. మద్యం దుకాణాల వ్యవహారంపై ఎన్ని పిటిషన్లు దాఖలు చేస్తారని పిటిషనర్ను సుప్రీంకోర్టు మందలించింది. ఈ విషయాన్ని ప్రచారం కోసం వాడుకుంటున్నారని కోర్టు వ్యాఖ్యానించింది