శ్రీనగర్.. కాల్పుల బీభత్సం.. ఇద్దరు టెర్రరిస్టుల మృతి.. ఇళ్ళు ధ్వంసం
శ్రీనగర్ లోని నవకదల్ ప్రాంతం మంగళవారం అర్ధరాత్రి కాల్పుల శబ్దంతో దద్దరిల్లింది. భద్రతా దళాలకు, హిజ్ బుల్ ముజాహిదీన్ కు చెందిన ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఈ కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు మరణించారు.
శ్రీనగర్ లోని నవకదల్ ప్రాంతం మంగళవారం అర్ధరాత్రి కాల్పుల శబ్దంతో దద్దరిల్లింది. భద్రతా దళాలకు, హిజ్ బుల్ ముజాహిదీన్ కు చెందిన ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఈ కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు మరణించారు. కొన్ని గంటల పాటు జరిగిన ఈ ఎన్ కౌంటర్.. స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. రాత్రి రెండు, రెండున్నర గంటల సమయంలో వఛ్చిన జవాన్లు.. తమను నిద్ర నుంచి లేపి ఇళ్ళు వదిలి వెళ్లిపొమ్మన్నారని, తమ వస్తువులేవీ తీసుకోకుండానే కట్టుబట్టలతో వెళ్లి రోడ్డు పై కూర్చున్నామని వారు తెలిపారు. ఎన్ కౌంటర్ ముగిసిన అనంతరం తిరిగి వఛ్చి చూసేసరికి మా ఇళ్ళు కూలిపోయి ఉన్నాయి.. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి అని వారు దీనంగా ప్రశ్నించారు. అయితే ఉగ్రవాదులకు ఈ ఇళ్లలోని కొంతమంది ఆశ్రయమిస్తున్నట్టు భారత జవాన్లు అనుమానించారని, బహుశా అందువల్లే ఆ ఇళ్లపై కాల్పులు జరిపి ఉండవచ్ఛునని శ్రీనగర్ అసిస్టెంట్ సబ్ ఇన్స్ పెక్టర్ చెబుతున్నారు.