Viral: సంచిలో కూరగాయలు తీసుకెళ్తున్నానని చెప్పిన వ్యక్తి… అనుమానంతో పోలీసులు ఆ బ్యాగ్ విప్పి చూడగా
మధ్యప్రదేశ్లో దారుణ ఘటన వెలుగుచూసింది. కన్నతండ్రిని హత్య చేసి ఆపై ఓ ప్లాస్టిక్ సంచిలో మృతదేహాన్ని బైక్పై తీసుకెళ్తున్న కుమారుడ్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
Crime: ప్రజంట్ విలువలు.. బంధాలు.. బంధుత్వాలు.. అన్ని మాయమైపోతున్నాయి. పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను, రక్తం పంచుకు పుట్టిన తోబుట్టువులను.. జీవితం పంచుకున్న అర్ధాంగిలను కూడా అత్యంత క్రూరంగా అంతమొందిస్తున్నారు కొందరు. తాజాగా మధ్యప్రదేశ్(Madhya Pradesh)లో ఇటువంటి దారుణ ఘటనే వెలుగుచూసింది. కన్నతండ్రిని దారుణంగా కొడుకే హత్య చేశాడు. ఆపైఓ ప్లాస్టిక్ సంచిలో మృతదేహాన్ని బైక్పై తీసుకెళ్లి మాయం చేసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే అనూహ్య రీతిలో పోలీసులకు చిక్కాడు. కుమారుడ్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
పోలీసులు వివరాల ప్రకారం.. పనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్జయ్య గ్రామంలో రాంలాల్(50) అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. తాజాగా అతడి కుమారుడు అమన్.. లిక్కర్ సేవించి వచ్చి తండ్రితో తీవ్రంగా గొడవపడ్డాడు. ఘర్షణ చెలరేగడంతో అత్యంత పాశవికంగా గొంతు కోసి హత్య చేశాడు. ఆపై డెడ్బాడీని మాయం చేసే ప్రయత్నం చేశాడు. అనుమానం రాకుండా ఉండడానికి తన తండ్రి డెడ్బాడీని ప్లాస్టిక్ సంచిలో వేసుకుని.. బైక్పై బయలుదేరాడు అమన్. మహరాజ్పుర్ ప్రాంతంలో అతడ్ని గమనించిన పోలీసులు.. అనుమానం వచ్చి బైక్ను ఆపారు. ప్లాస్టిక్ సంచిలో ఏమున్నాయని అడగ్గా… కూరగాయలను తీసుకెళ్తున్నట్లు చెప్పాడు. కానీ అతని మాటల్లో, ప్రవర్తనలో తేడా ఉండటం చూసి.. సంచిని తెరచి చూసిన పోలీసులు కంగుతిన్నారు. వెంటనే అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించగా.. తండ్రిని చంపినట్లు అంగీకరించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..