Shiv Sena MP Sanjay Raut: ఆ కేసులో ఎంపీ సంజయ్ రౌత్కు ఈడీ సమన్లు
Shiv Sena MP Sanjay Raut: మహారాష్ట్ర రాజకీయాలు సస్పెన్స్ థ్రిల్లర్ను తలపిస్తున్నాయి. అటు ఏక్నాథ్ షిండే వర్గం, ఇటు ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి..
Shiv Sena MP Sanjay Raut: మహారాష్ట్ర రాజకీయాలు సస్పెన్స్ థ్రిల్లర్ను తలపిస్తున్నాయి. అటు ఏక్నాథ్ షిండే వర్గం, ఇటు ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. తాజాగా శివసేన ఎంపీ సంజయ్రౌత్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు జారీ చేయడం సంచలనం రేపుతోంది. పత్రాచల్ భూ కుంభకోణం కేసులో రేపు విచారణకు రావాలని సంజయ్రౌత్కు ఈడీ సమన్లు జారీ చేసింది. అయితే ఈడీ సమన్లకు తాను భయపడడం లేదని సంజయ్రౌత్ ట్వీట్ చేశారు. తాము బాల్థాక్రే శిష్యులమని, అరెస్ట్ చేసినప్పటికి భయపడేది లేదన్నారు. తమ పోరాటాన్ని ఆపేందుకు కుట్ర జరుగుతోందన్నారు రౌత్. సంజయ్రౌత్కు ఈడీ సమన్లు జారీ చేయడంపై కాంగ్రెస్ మండిపడింది. బీజేపీ చేతిలో కీలుబొమ్మగా మారిన ఈడీ రౌత్కు సమన్లు జారీ చేసిందని ఆరోపించింది.
గతంలో ప్రవీణ్ రౌత్ను ఈడీ అరెస్ట్ చేసింది. ప్రవీణ్ రౌత్ సంజయ్ రౌత్కు సన్నిహితుడు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇటీవల ప్రవీణ్ రౌత్కు చెందిన కోట్ల విలువైన ఆస్తులను కూడా జప్తు చేసింది. 11 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఇందులో పాల్ఘర్లో ప్రవీణ్ రౌత్కు సంబంధించిన ఆస్తి దాదాపు 9 కోట్లు. దాదర్లోని ఫ్లాట్, 2 కోట్ల విలువైన అలీబాగ్లోని ప్లాట్ సంజయ్ రౌత్ భార్యకు సంబంధించినవని ఆరోపణలు వచ్చాయి.
2020 డిసెంబర్లో పీఎంసీ బ్యాంకు కుంభకోణం కేసులో విచారణ సందర్భంగా గతంలో ప్రవీణ్ పేరు వచ్చింది. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ భార్య వర్షకు ప్రవీణ్ రౌత్ భార్య మాధురి 2010లో ముంబైలోని దాదర్లో ఫ్లాట్ను కొనుగోలు చేసేందుకు రూ.55 లక్షల వడ్డీ లేని రుణం ఇచ్చినట్లు దర్యాప్తు సంస్థకు తెలిసింది. ఈ డబ్బు ఎక్కడిది అని ఈడీ ఆరా తీస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి