చైనా సరిహద్దుల్లోకి “ఆర్ఎస్ఎస్”ను పంపించాలి.. కాంగ్రెస్ నేత వ్యాఖ్య..
లదాఖ్లోని గాల్వన్ లోయలో సోమవారం చోటుచేసుకున్న సంఘటన.. దేశంలో రాజకీయ దుమారం రేపుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.
లదాఖ్లోని గాల్వన్ లోయలో సోమవారం చోటుచేసుకున్న సంఘటన.. దేశంలో రాజకీయ దుమారం రేపుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జవాన్లకు ఆయుధాలు లేకుండా అక్కడికి (బార్డర్) ఎందుకు పంపిచారంటూ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. అయితే రాహుల్కు కౌంటర్ ఇచ్చారు బీజేపీ నేతలు. ఆయుధాలు తీసుకెళ్లలేదని ఎవరు చెప్పారంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చారు. ఇక మరికొందరు బీజేపీ నేతలైతే రాహుల్ ప్రశ్నలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొట్టిపారేశారు.
ఈ క్రమంలో మరో కాంగ్రెస్ నేత హుస్సేన్ దల్వాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సరిహద్లుల్లోకి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వారిని పంపించాలంటూ వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు జాతీయ మీడియా ఏజెన్సీతో మాట్లాడిన ఆయన.. ఈ వ్యాఖ్యలు చేశారు. హుస్సేన్ కూడా ఆయుధాలు లేకుండా సైన్యాన్ని బార్డర్లోకి ఎందుకు పంపారని.. అక్కడ కర్రలతో ఏమైనా శాఖ నిర్వహిస్తున్నారా..? అంటూ ప్రశ్నించారు. చైనా వారు ఇనుపచువ్వలు కల్గిన రాడ్లతో వచ్చి.. మన సైనికులను 20 మందిని పొట్టనబెట్టుకున్నారన్నారు. అయితే చైనా వారు మాత్రం ఎవరూ మరణించలేదంటూ ఆరోపించారు. ఇదిలావుంటే.. చైనా అధికారికంగా 30 మంది చైనాకు చెందిన జవాన్లు మరణించినట్లు ప్రకటించింన సంగతి తెలిసిందే.
#WATCH Congress’ Husain Dalwai says, “…No one from their side died, only our jawans died…How can you send our jawans without arms? They could’ve fought but didn’t get chance. They just had sticks. Is this RSS shakha? Why send soldiers? Send RSS people. They’ll guard border.” pic.twitter.com/5XVGyFLV6I
— ANI (@ANI) June 19, 2020