సుప్రీం కోర్టు కీలక నిర్ణయం.. ఎన్నారైల ఆదాయపు పన్ను పరిమితులపై సీబీడీటీకి కీలక ఆదేశాలు ఆదేశం
కోవిడ్ -19 నేపథ్యంలో 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను చెల్లించడంపై ప్రవాస భారతీయులకు ఇచ్చే ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్లపై మూడు వారాల్లోగా నిర్ణయం తీసు..
కోవిడ్ -19 నేపథ్యంలో 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను చెల్లించడంపై ప్రవాస భారతీయులకు ఇచ్చే ఉపశమనాలపై మూడు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు బుధవారం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ (సిబిడిటి) ను ఆదేశించింది. కాగా, పిటిషనర్ దుబాయ్కు చెందిన ఎన్ఆర్ఐ గౌరవ్ బైద్ను మూడు రోజుల్లో సీబీడీటీకి ప్రాతినిధ్యం వహించాలని కోర్టు ఆదేశించింది. 2020 మార్చి లో భారత పర్యటనకు వచ్చిన ఆయన.. 2020-21 మార్చిలో భారత్లో 182 రోజుల తిరిగి వెళ్లిపోయారు.
అయితే 2020-21లో చాలా వరకు అంతర్జాతీయ విమాన ప్రయాణాలను కేంద్ర హోంమంత్రిత్వశాఖ, పౌర విమానయాన శాఖలు నిషేధించాయి. దీంతో పర్యవసానంగా చాలా మంది ఎన్నారైలు భారత్లోనే ఉండిపోయారు. దీంతో వీరి గడువును పొడిగించాల్సి వచ్చింది. ఇలా కరోనా కాలంలో వెళ్లలేకపోయిన ఎన్నారైల గురించి పిటిషనర్ తన పిటిషన్లో వెల్లడించారు. దీంతో ఐటీ చట్టంలోని సెక్షన్ 6 కింద రెసిడెన్సీ అంశంపై 2019-20 ఆర్థిక సంవత్సరానికి 2020 మే 8న ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. తమతమ పని నిమిత్తం స్వదేశానికి వచ్చి తిరిగి వెళ్లలేని ఎన్నారైలకు సడలింపులు ఇచ్చారు. లాక్డౌన్ కారణంగా ఈ విషయంపై 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇంత వరకు ఎలాంటి క్లారిటీ రాలేదు.